ఏపీలో జగన్ ప్రభుత్వం విఫలం అవుతున్న తీరుపై మాజీ సీఎం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించాడు. జగన్ ప్రభుత్వం బాదుడే బాదుడు అంటూ ఈమద్య కాలంలో పదే పదే విమర్శలు చేస్తున్న చంద్రబాబు నాయుడు అదే నినాదంతో జనాల్లోకి వెళ్లేందుకు సిద్దం అయ్యారు. తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రా వ్యాప్తంగా పర్యటనలకు సిద్దం అయ్యారు.
ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జగన్ ఒక్క ఛాన్స్ అనగానే జనాలు అందరు మాయలో పడిపోయినట్లుగా 151 సీట్లలో గెలిపిస్తే ఇప్పుడు ఆయనకు అహంకారం పెరిగింది. రాష్ట్రంలో విద్యుత్ లేకున్నా బిల్లులతో బాదుతున్నారు. తీవ్ర ఆర్థిక లోటు రాష్ట్రంగా ఏపీని నిలుపుతున్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆంద్ర ప్రదేశ్ మరో శ్రీలంక మాదిరిగా అవుతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల వారిని వైకాపా ప్రభుత్వం అధిక బిల్లులు.. అధిక ధరల తో వాయిస్తూ ఉందని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా కు ఓటు వేసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు బాధ పడుతున్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
386532 346298Wow Da weiss man, wo es hingehen muss Viele Grsse Mirta 942750
223597 249956You created some decent points there. I looked over the internet for any problem and identified most individuals goes as well as along with your web site. 872188