అస్సలు అవినీతికి అవకాశమే లేకుండా అద్భుతమైన పాలన అందించేస్తున్నామని అంటోంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం. మరి, లక్షల కోట్ల రూపాయల అప్పులెందుకు పెరిగిపోతున్నట్లు.? కరోనా సంక్షోభం కారణంగా ప్రజల్ని ఆదుకోవడానికి అప్పలు చేయడంలేదన్నది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చెబుతున్ ‘ఆర్థిక ’ మంత్రం.
చంద్రబాబు హయాంలో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు కొత్తగా జరిగితే, ఐదేళ్ళలో ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడమా.? రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారా.? అంటూ నానా యాగీ చేసింది అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
మరిప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్నదేంటి.? రెండున్నరేళ్ళలోనే దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయల కొత్త అప్పు చేసింది వైఎస్ జగన్ సర్కార్. చంద్రబాబుకి ముందు జరిగిన అప్పులు, చంద్రబాబు హయాంలో జరిగిన అప్పులు, వైఎస్ జగన్ హయాంలో ఇప్పటిదాకా జరిగిన అప్పులు.. అన్నీ కలిస్తే, ఆరు లక్షల కోట్లకు పైగానే మొత్తం అప్పు లెక్క చేరింది.
ఇంకో రెండేళ్ళ పాలనలో వైఎస్ జగన్ సర్కార్, 10 లక్షల కోట్ల రూపాయల మైలు మార్కుకి ఆంధ్రప్రదేశ్ అప్పుల్ని చేర్చబోతోందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. ఇంతకీ, ఈ డబ్బు అంతా ఏమైపోతోంది.? ఏడేళ్ళుగా రాష్ట్రానికి రాజధాని లేదు.. గడచిన రెండున్నరేళ్ళుగా రాష్ట్రంలో రోడ్లకు పడ్డ గుంతల్నీ పూడ్చలేదు. కానీ, చేస్తున్న అప్పులు పెరిగిపోతున్నాయ్.. కొత్త అప్పులు నమోదవుతూనే వున్నాయ్.
‘డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం..’ అని కొన్నాళ్ళ క్రితం ఓ మంత్రిగారు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.. అది ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఘటన. ‘మా యాసని కించపర్చుతారా.?’ అంటూ సదరు మంత్రిగారు ఓ మీడియా సంస్థపై గుస్సా అయ్యారనుకోండి.. అది వేరే సంగతి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఇప్పుడెంత.? ఒక్కో మనిషి మీదా ఇప్పుడున్న అప్పు ఎంత.? అసలు ఆంద్రప్రదేశ్ భవిష్యత్తేంటి.? తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటుకు గురి కాక తప్పదు. సంక్షేమం పేరుతో, పాలకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకునేదెప్పుడు.?
866984 30852Hello! I just wish to give an enormous thumbs up for the excellent data you may have right here on this post. I can be coming again to your blog for far more soon. 370540
8399 546259Very instructive and excellent bodily structure of topic matter, now thats user pleasant (:. 911363