గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న శివశంకర్ మాస్టర్ కొద్దిసేపటి క్రితం కన్నుమూసారు. కోవిడ్ వైరస్ సోకడంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయిన శివశంకర్ మాస్టర్ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు.
ఆయనకు నయమవుతోందని కూడా వార్తలు వచ్చాయి. శివశంకర్ మాస్టర్ కు ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఖరీదైంది కావడంతో కొంత మంది ప్రముఖులు ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
చిరంజీవి ఆర్ధిక సహాయంగా 3 లక్షల రూపాయలను ఇచ్చారు. అయితే కోవిడ్ తో ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అవ్వడంతో పాటు ఇతర కాంప్లికేషన్స్ కూడా ఉండడంతో దురదృష్టవశాత్తూ ఆయన కన్నుమూసారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసారు శివశంకర్ కుటుంబసభ్యులు.
ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు.