స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. క్లాస్ నుంచి కంప్లీట్ మాస్ లుక్ లోకి మారి సుకుమార్ డైరెక్షన్ లో ‘పుష్ప’ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మొదలయ్యే టైంకి లాక్ డౌన్ రావడంతో షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ సినిమా పూర్తి చేశాకే మరో సినిమా మొదలు పెడతారు. కానీ లాక్ డౌన్ టైంలో పలు ఆసక్తికర కథలు వింటూ నచ్చిన స్టోరీ లైన్స్ ని పూర్తి కథగా డెవలప్ చేయమని చెబుతున్నారు అల్లు అర్జున్.
అందులో భాగంగా రీసెంట్ గా మహి వి రాఘవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ‘పాఠశాల’, ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ సినిమాలను రూపొందించిన మహి వి రాఘవ్ గత కొంత కాలంగాగా కరప్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కథ పలు హీరోల దగ్గరికి వెళ్ళింది. కానీ కార్యరూపం దాల్చలేదు.తాజాగా మహి వి రాఘవ్ అల్లు అర్జున్ కి ఒక నేరేషన్ ఇవ్వడంతో సుముఖంగానే ఉన్న అల్లు అర్జున్ పూర్తి కథని ఫైనల్ చేసి చెప్పమన్నారట. దాంతో మహి వి రాఘవ్ పూర్తి కథని త్వరలోనే అల్లు అర్జున్ కి వినిపించనున్నారట.
అల్లు అర్జున్ కి కథ బాగా నచ్చడంతో మహి వి రాఘవ్ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లేనని అంటున్నారు. మరోవైపు పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ‘సోను కె టిటు కి స్వీటీ’ సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. మరి ఏ ప్రాజెక్ట్ ముందు పట్టాలెక్కుతుందో చూడాలి.
741995 918492I admire the valuable facts you offer inside your articles. I will bookmark your weblog and also have my children verify up here often. Im quite positive theyll learn lots of new issues proper here than anybody else! 75029
228527 375708Thanks for taking the time to discuss this subject. I really appreciate it. Ill stick a link of this entry in my blog. 330593