Switch to English

కరోనా టెస్టుల్లో నిర్లక్ష్యం.. ఇదీ ఓ రికార్డేనేమో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

కరోనా టెస్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోందంటూ వైఎస్సార్సీపీ మద్దతుదారులైన నెటిజన్లు ఎప్పటికప్పుడు పలు రకాల హ్యాష్‌ ట్యాగ్‌లను ట్రెండింగ్‌లో వుంచుతున్నారు. వీటిల్లో ‘ఏపీ ఇన్‌ సేఫ్‌ హ్యాండ్స్‌’, ‘వైఎస్‌ జగన్‌ కేర్స్‌’ వంటివి వున్నాయి. నిజమే, కరోనా టెస్టుల విషయంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చాలా వేగంగా దూసుకెళ్తోంది. కానీ, ప్రకాశం జిల్లాలో ఏకంగా 27 వేల టెస్టులకు సంబంధించి శాంపిల్స్‌ పనికిరాకుండా పోయాయన్న వార్త ఎప్పుడైతే అధికారికంగా బయటకొచ్చిందో అంతా షాక్‌కి గురయ్యారు.

ఒక్క జిల్లాలోనే పరిస్థితి ఇలా వుంటే, మొత్తంగా 13 జిల్లాల్లో పరిస్థితి ఏంటి.? అన్న అనుమానం తలెత్తకుండా వుంటుందా.? గడచిన కొద్ది రోజులుగా కరోనా టెస్టుల సంఖ్య తగ్గుతోంది.. అదే సమయంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పాజిటివిటీ రేటు గత నాలుగైదు రోజులుగా పది శాతాన్ని టచ్‌ చేస్తుండడం గమనార్హం. సరిగ్గా ఈ టైవ్‌ులోనే సేకరించిన శాంపిల్స్‌ పరీక్షలకు పనికిరాకుండా పోవడం కొత్త అనుమానాలకు తావివ్వకుండా వుంటుందా.?

కొందరి నిర్లక్ష్యం కారణంగా దాదాపు 27 వేల శాంపిల్స్‌ పనికిరాకుండా పోయాయని ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగమే స్పష్టం చేసింది. ఇప్పుడు ఏకంగా 2 లక్షలకు పైగా శాంపిల్స్‌ పనికిరాకుండా పోయాయన్నది ఓ పత్రికా కథనం తాలూకు సారాంశం టీడీపీ అనుకూల మీడియాకి చెందిన ఆ పత్రికలో ఇలాంటి కథనం రావడంతో చాలామంది లైట్‌ తీసుకుంటున్నారు. కానీ, అక్కడ.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఉదంతాన్ని చూస్తే, ఈ 2 లక్షల శాంపిల్స్‌ వృధాని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం.

పెద్దయెత్తున శాంపిల్స్‌ సేకరించడంతోపాటు, వాటిని పద్దతి ప్రకారం పరీక్షలకు పంపి.. ఫలితాల్ని క్రోడీకరించి.. బాధితులకు వైద్యం అందించడం చేయాలి. తాము అసలు శాంపిల్స్‌ ఇవ్వకుండానే టెస్టుల ఫలితాల వివరాలు తమ మొబైల్‌కి వస్తున్నాయంటూ కొందరు వాపోయిన విషయాన్ని వీడియోలతో సహా నెటిజన్లు సోషల్‌ మీడియాలో పెడుతున్న విషయం విదితమే. మొత్తమ్మీద, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌కి సంబంధించి రోజురోజుకీ అనుమానాలు పెరిగిపోతున్నాయి.. ప్రజల్లో ఆందోళన కూడా పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ప్రజలకు భరోసా ఇచ్చేలా వ్యవహరించాలి. వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వ పెద్దలు స్పందించాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...