అల్లు అరవింద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆహా అనే ఓటీటీని ప్రారంభించాడు. ఆ ఓటీటీకి సంబంధించి ఇప్పటికే మంచి పబ్లిసిటీ దక్కింది. తెలుగు కంటెంట్ ను మాత్రమే ఆహా లో చూపిస్తాం అంటూ మొదటి తెలుగు పూర్తి ఓటీటీ అంటూ ఆహాను ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. ఆహా తో పాటు తెలుగు నిర్మాతల నుండి మరిన్ని ఓటీటీలు రాబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆహా దారిలోనే అక్కినేవారు కూడా ఓటీటీని ప్రాంరభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట.
ఆమద్య ప్రముఖ నిర్మాత ఒకరు ఓటీటీ అంటూ ప్రచారం జరిగింది. కాని ఆయన ఓటీటీ ఆలోచన ప్రస్తుతానికి లేదు అన్నాడు. కాని అక్కినేని వారు మాత్రం ఓటీటీ పై ఆసక్తితో ఉన్నారు. నాగార్జున తన సన్నిహితులతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో కలిసి ఓటీటీని ప్రారంభించే ఉద్దేశ్యంతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే నాగ్ నుండి రాబోతున్న ఓటీటీ కేవలం తెలుగు మాత్రమే కాకుండా అన్ని భాషలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఓటీటీ బిజినెస్ పెరుగుతున్న సమయంలో నాగ్ నుండి ఈ నిర్ణయం అభినందనీయం.