గుంటూరుకు చెందిన నటి రేఖ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈమె తెలుగు బుల్లి తెరపై కనిపించింది. రెండు మూడు సీరియల్స్ చేయడంతో పాటు కొన్ని పాటలు కూడా పాడటం జరిగింది. కొన్నాళ్ల తర్వాత అవకాశాలు రాకపోవడంతో తిరిగి గుంటూరు వెళ్లి పోయి అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆ తర్వాత మనస్ఫర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో వారికి ఒక పాప ఉంది.
అహ్మద్ నుండి విడాకులు తీసుకున్న రేఖ కొన్నాళ్లు ఒంటరిగా జీవితంను గడిపింది. ఆ తర్వాత చైతన్యను వివాహం చేసుకుంది. చైతన్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఇక రేఖ గుంటూరులో కొన్ని కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడంతో పాటు అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉండేది. ఈమద్య చైతన్య రియల్ ఎస్టేట్లో నష్టాలపాలయ్యి అప్పులపాలయ్యాడు. రేఖ తీవ్రమైన మానసిక ఒత్తిడితో అప్పుల బాధ బరించలేక బాత్ రూంలో ఉరి వేసుకుని మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
35364 449682Thank you for your style connected with motive though this info is certain place a new damper within the sale with tinfoil hats. 584698