Switch to English

రెస్ట్ ఇన్ పీస్ మీడియా.. జనసేనాని ప్రశ్నించేది ఇందుకే మరి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

Pawan Kalyan: ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా తెలుగు మీడియా చాలావరకు రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఏ వార్తని ‘కవర్’ చేస్తే ఏ పార్టీకి కోపం వస్తుందోనని ఆయా పార్టీలకు చెందిన మీడియా సంస్థలు తెగ ఆందోళన చెందుతుండడం వల్ల, అసలు సిసలు సమస్యలకు ‘కవరేజీ’ దక్కడంలేదు. హైద్రాబాద్‌లో చిన్నారి చైత్ర హత్యాచారానికి గురైన ఘటనని మీడియా ‘తొక్కిపెట్టే’ ప్రయత్నం చేసింది.

ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నారనే వార్త బయటకొచ్చిందో.. ఆ తర్వాత మీడియా హంగామా షురూ అయ్యింది. మరోపక్క, సోషల్ మీడియా.. మెయిన్ స్ట్రీమ్ మీడియా దిక్కుమాలిన పాత్రికేయంపై నిప్పులు చెరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై మెయిన్ స్ట్రీమ్ మీడియా మింగలేక కక్కలేక.. అన్నట్టు నానా తంటాలూ పడుతోంది. మెరుగైన సమాజం కోసం.. అని చెప్పుకునే బురద ఛానల్ అయితే, హత్యాచారం జరిగింది చిన్నారిపైన గనుక.. తాము ఆ వార్తను కవర్ చేసే విషయంలో సంయమనం పాటించామని ‘కవరింగ్’ కథనాన్ని తెరపైకి తెచ్చింది.

ఇలాంటి ఎన్నో ఘటనల విషయంలో చెయ్యకూడని ఓవరాక్షన్ సదరు బురద ఛానల్ చేసిన విషయాన్ని ఎలా విస్మరించగలం. ‘అనవసర విషయాలపై అత్యుత్సాహం చూపుతున్న మీడియా, ఇలాంటి ఘటనలపై స్పందించకపోవడం శోచనీయం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న చేసిన విమర్శ తర్వాత, సదరు బురద ఛానల్ ఉలిక్కిపడాల్సి వచ్చింది. పవన్ తమను విమర్శించిన వైనాన్ని పైకి చెప్పుకోలేక, చిన్నారి చైత్రపై హత్యాచారం ఘటన మీద ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. ఆ కార్యక్రమంలోనే తమ గోడు వెల్లబోసుకుంది ఆ బురద ఛానల్.

ఇందుకే, ఇలాంటి సందర్భాల్లోనే రెస్ట్ ఇన్ పీస్ మీడియా.. అని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైతే, బైక్ డిజైనింగ్ మీద విశ్లేషణలతో సహా హోరెత్తించేసింది సదరు బురద ఛానల్. అంతేనా, బైక్ స్పీడ్ ప్రమాద సమయంలో గంటకు 400 కిలోమీటర్లనీ సెలవిచ్చింది. చిన్నారులపై హత్యాచారాలు సహా వృద్ధులపైనా హత్యాచారాలు.. వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి.. ప్రభుత్వాల్ని నిలదీసే ధైర్యం లేని బురద ఛానల్.. మెరుగైన సమాజం కోసం.. అని చెప్పుకోవడం మానేస్తే మంచిది.

1 COMMENT

  1. బురద ఛానల్ కాదు సమాజం పైన విషం చిమ్మే ఛానల్ అది. ఇంక ఆ ఛానల్ యాంకర్లు పిశాచ తోడేళ్ళు. వాళ్ళ ఉన్మాదానికి పరాకాష్ట ఆ ఛానల్ ఆస్థాన సైకో లతో ఇంటర్వ్యూలు. ఆ విషపు ఛానల్ పీడ తెలుగు ప్రజలకి ఎప్పటికీ విరగడ అవుతుందో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...