ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో వారి కోసం వేర్వురు కమిషన్లు ఏర్పాటు చేస్తూ.. బిల్లు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి రెండు కీలక బిల్లులను రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ గురువారం ఆమోదించారు. ఏపీ ఎస్సీ కమిషన్, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.
ఎస్సీ కమిషన్ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ గతేడాది జనవరిలో ఆమోదించింది. అసెంబ్లీలో ఆమోదించిన ఈబిల్లుకు శానసమండలి కొన్ని సవరణలు చేసి వెనక్కు పంపింది. అయితే.. ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావని శాసన సభ నిర్ణయించి.. బిల్లును 2020 జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యథాతథంగా ఆమోదించింది. ఇప్పుడు ఇదే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో త్వరలోనే ఏపీలో ప్రత్యేక ఎస్సీ కమిషన్ అందుబాటులోకి రానుంది.
194009 161004This is really fascinating, Ill take a look at your other posts! 522560
174079 246220Intriguing, but not perfect. Are you going to write far more? 198677
292447 757348I really got into this article. I identified it to be intriguing and loaded with special points of interest. I like to read material that makes me believe. Thank you for writing this great content material. 87197