Switch to English

రఘురామ చుట్టూ బిగుసుకుంటోన్న వైసీపీ ఉచ్చు.? నిజమెంత.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఏకంగా లక్ష యూరోలు.. సుమారుగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడికీ మధ్య జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోన్న విషయం విదితమే. రాజద్రోహం కేసులో రఘురామ అరెస్టయ్యాక, ఆయన్నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ద్వారా, ఈ విషయాన్ని ఏపీ సీఐడీ బయటపెట్టిందని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు ఏపీ సీఐడీ కూడా, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు ఆ మధ్య ఓ కథనం తెరపైకొచ్చింది. ఇందులో నిజానిజాలెంత.? అన్నదానిపై నిగ్గు తేల్చాల్సింది న్యాయస్థానాలే.

అయితే, బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో సహా, వైసీపీ.. తీవ్రస్థాయి ఆరోపణలు గుప్పిస్తోంది. ఓ అడుగు ముందుకేసి, ప్రధాని నరేంద్ర మోడీకీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కీ రఘురామ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. రఘురామ దేశం విడిచి పారిపోకుండా చూడాలనీ, ఆయనపై మనీ లాండరింగ్, ఫెమా చట్టాల కింద చర్యలు తీసుకోవాలనీ వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం దాకా ఎందుకు.? పక్కా ఆధారాలున్నాయని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం, రఘురామ మీద కొత్తగా కేసులు బనాయిస్తే సరిపోతుంది కదా.? అన్న డౌట్ మీకొస్తే అది మీ తప్పు కానే కాదు.

ఎలాగైనా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మీద అనర్హత వేటు వేయించాలనే ప్రయత్నంలో వుంది వైసీపీ. రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యల కంటే, వైసీపీకి రఘురామ తలనొప్పి ఎక్కువైపోయింది మరి. అయినా, ఎవరు ఎవరి మీద ఏం ఫిర్యాదులు చేస్తున్నారు.? ఆర్థిక నేరాల విషయమై కదా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నది.? అవే కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడిగా వున్నారు కదా.? మరి, అలాంటి పార్టీ నేతృత్వంలో నమోదయ్యే ఫిర్యాదుల్లో వాస్తవాలెలా వుంటాయి.? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

‘20కి పైగా అభియోగాలు మీ ఇద్దరి మీదనే వున్నాయి.. మీరు నా మీద ఆరోపణలు చేయడమేంటి.. సిగ్గులేకపోతే సరి..’ అంటూ ఇప్పటికే రఘురామ తన మీద వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. అంతేనా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి ఫిర్యాదు చేశారు రఘురామ. దానికి కౌంటర్ ఎటాక్ తప్ప.. రఘురామ మీద వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలుంటాయని ఎలా అనుకోగలం.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...