ఎవరూ ఊహించని కాంబినేషన్ ఇది. క్లాస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ను క్రియేట్ చేసుకున్న శేఖర్ కమ్ముల సౌత్ ఇండియాతో బాలీవుడ్ లో కూడా పేరు సంపాదించుకున్న ధనుష్ తో సినిమా చేయబోతున్నాడంటూ ఈరోజు నుండి రూమర్స్ మొదలయ్యాయి.
అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తారని సమాచారం. శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ తెరకెక్కించిన ఏషియన్ సునీల్ ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు.
ధనుష్ హిందీలో పలు చిత్రాలు చేసాడు. అలాగే తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ధనుష్ తో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే అది కచ్చితంగా ఆసక్తి కలిగించేదే. ఈ ప్రాజెక్ట్ గురించిన మరింత సమాచారం అతి త్వరలో రానుంది.