వైకాపా రెబల్ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు వరుసగా ప్రభుత్వంకు లేఖలు రాస్తున్నాడు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటికే అయిదు లేఖలను రాశాడు. అందులో గతంలో మీరు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేశాడు. ఏ హామీలు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారో ఆ హామీలను వెంటనే నెరవేర్చాల్సిందే అంటూ రఘురామ సీఎం కు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. తాజాగా మరోసారి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఆరవ లేఖలో ఉద్యోగుల సమస్యలపై స్పందించాడు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డీఏ మరియు పీఆర్సీ వెంటనే ఇవ్వాలని.. ఉద్యోగులు ఎన్నో బాధలు పడుతున్నారు. ఈ సమయంలో వారు ప్రజలకు చాలా సేవ చేస్తున్నారు. కనుక వారికి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాల్సిందే అంటే రఘురామ డిమాండ్ చేశాడు. ఎన్నికల్లో ఉద్యోగస్తులు వైకాపా కు మద్దతుగా నిలవడం వల్లే సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాడు అని అందుకే వారికి ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందే అంటూ రఘురామ లేఖలో పేర్కొన్నాడు.