ఆటతీరుతోపాటు తన నడవడికతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. మరోసారి వార్తల్లో నిలిచాడు. నాయకుడంటే ఎలా ఉండాలో చూపించాడు. బయో బబుల్ బద్దలు కావడంతో ఐపీఎల్ ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఐపీఎల్ ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటగాళ్లందరూ ఇంటిబాట పట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన ప్లేయర్లు కూడా పలువురు ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ ధోనీ మాత్రం ఇంకా హోటల్ లోనే ఉన్నాడు. తన జట్టులోని విదేశీ ఆటగాళ్లు కూడా ఇళ్లకు బయలు దేరిన తర్వాతే హోటల్ ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
జట్టులోని స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరిన తర్వాతే ధోని ఇంటికి వెళ్లాలని భావిస్తున్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన సభ్యుడు ఒకరు తెలిపాడు. ఈ మేరకు వారిని స్వదేశాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని జట్టు యాజమాన్యాన్ని కోరినట్టు వివరించాడు. ఐపీఎల్ సీజన్ మధ్యలో ధోనీ తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. ప్రసుత్తం ఇద్దరూ కరోనా నుంచి కోలుకుని ఇంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ధోనీ తన జట్టులోని ప్లేయర్లంతా ఇళ్లకు చేరిన తర్వాత తన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను చూడనున్నాడు. ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కూడా తన జట్టు ఆటగాళ్ల పట్ల ధోనీ చూపిస్తున్న ఆప్యాయత అదుర్స్ అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన నాయకుడు ధోనీ అని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
675227 175924Some genuinely very good articles on this site , thankyou for contribution. 959810