ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ ముంబైలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్, ఢిల్లీల్లో బయో బుడగ బద్దలు కావడంతో అక్కడ ఉన్న సామగ్రిని ముంబైకి తరలించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్ లో మొదటి లీగ్ ను ముంబై, చెన్నైల్లో విజయవంతంగా నిర్వహించారు. అక్కడ బయో బబుల్ లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. రెండో దశ మ్యాచ్ లు అహ్మదాబాద్, ఢిల్లీల్లో జరగాల్సి ఉండటంతో ఐపీఎల్ జట్లన్నీ అక్కడకు వెళ్లాయి. ఈ క్రమంలో కోల్ కతా ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, ఢిల్లీ గ్రౌండ్ సిబ్బందికి కరోనా వచ్చింది. దీంతో సోమవారం నాటి కోల్ కతా, బెంగళూరు మ్యాచ్ వాయిదా పడింది.
మంగళవారం మ్యాచ్ కూడా సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో తదుపరి వేదికలైన బెంగళూరు, కోల్ కతా వెళ్లడానికి ఆటగాళ్లు సుముఖంగా లేరని సమాచారం. దీంతో ముంబైలోనే ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి చర్యలు ప్రారంభించినట్టు చెబుతున్నారు. మే 7వ తేదీలోగా ఇవన్నీ పూర్తిచేయాలని.. అదే సమయంలోగా మ్యాచ్ లు రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో జూన్ వరకు షెడ్యూల్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాలపై మంగళవారం సాయంత్రానికి స్పష్టత రావొచ్చు.
132774 796406Properly, that is excellent, yet consider further options weve got here? Could you mind submitting an additional article relating to them also? A lot of thanks! 353899