హైదరాబాద్ లోని లింగోజీగూడ డివిజన్ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవానికి సహకరించాలన్న బీజేపీ వినతికి టీఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది. అక్కడ పోటీకి దూరంగా ఉంటామని పేర్కొంది. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనను కలిసిన బీజేపీ నాయకులకు హామీ ఇచ్చారు. డిసెంబర్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి ఆకుల రమేశ్ గౌడ్ గెలుపొందారు. టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుపై ఆయన విజయం సాధించారు. అయితే, ప్రమాణ స్వీకారం చేయకుండానే రమేశ్ గౌడ్ అకాల మరణం పొందారు. దీంతో ఈ డివిజన్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో ఇక్కడ ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించాలని అధికార పార్టీకి బీజేపీ విన్నవించింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నేతృత్వంలో బీజేపీ నేతలు, రమేశ్ గౌడ్ కుటుంబ సభ్యలు ప్రగతి భవన్ కు వెళ్లి కేటీఆర్ ను కలిశారు. పార్టీ తరఫున రమేశ్ గౌడ్ కుమారుడికి అవకాశం కల్పిస్తున్నామని.. అందువల్ల ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. దీనికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. తమ పార్టీ తరఫున అక్కడ అభ్యర్థిని నిలపబోమని పేర్కొన్నారు. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సైతం కేటీఆర్ ఫోన్ చేసి ఏక్రగీవానికి సహకరించాలని కోరారు.
163622 782317I really got into this write-up. I identified it to be intriguing and loaded with exclusive points of interest. I like to read material that makes me believe. Thank you for writing this excellent content. 61780
191398 40094great day, your site is genuinely unquie. Anways, i do appreciate your work 32228
986385 728593Wow! This could be 1 specific of the most useful blogs Weve ever arrive across on this topic. Basically Excellent. Im also an expert in this subject therefore I can understand your effort. 108511
617319 715829Thank you for sharing with us, I conceive this internet site genuinely stands out : D. 350788