చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో స్పోక్స్ పర్సన్ గా, టీడీపీ అధికారంలో ఉండగా మీడియా సలహాదారుడిగా ఉన్న పరకాల ప్రభాకర్ ను ఎవరూ అంత తేలిగ్గా మరచిపోరు. ముఖ్యంగా ఈయన పేరు వింటే ప్రజారాజ్యం పార్టీలో చేసిన హడావిడే గుర్తొస్తుంది ఎవరికైనా. టీడీపీ హయాంలో మంచి పదవిలోనే ఉన్నా రాజీనామా చేశారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ భర్త కూడా అయిన ప్రభాకర్ ప్రస్తుతం లైమ్ లైట్ లో లేరు. కానీ.. ఓ చానెల్ బాధ్యతలు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు పరకాల ప్రభాకర్ మరో సంచలనానికి తెర తీయబోతున్నారని తెలుస్తోంది.
అమరావతి ప్రజలు, రైతుల దుస్థితి, ఆ ప్రాంతంలో జరిగిన పనులను వెలుగులోకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. మీడియా ద్వారా అమరావతి ప్రాంతంలో ఏం జరిగిందో సవివర నివేదక ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఏపీలో ప్రస్తుత రాజకీయాలు, పరిస్థితిని కూడా తనదైన స్టయిల్లో ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అయింది.
సంచలనాలు సృష్టించడం ప్రభాకర్ కు కొత్తేమీ కాదు. ప్రజారాజ్యం, టీడీపీల్లో ఏ పదవిలో ఉన్నా తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు మరోసారి అమరావతి కథనాలను ప్రసారం చేయడానికి సిద్ధం కానుండటంతో ఎటువంటి సంచలనాలు నమోదు చేస్తారో అనే వాదనలు వినిపిస్తున్నాయి..