ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఆందోళనకరంగా మార్చుకోవడంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా. ఓపక్క హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనే ఆందోళనలు రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈలోపు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిక్లరేషన్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. అసలు దీనిపై ఎవరికీ ఆలోచన లేని సమయంలో ఈ వ్యాఖ్యలు చేసి రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేశారు. ఈయన వ్యాఖ్యలకు ఆజ్యం పోసినట్టు మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు తీవ్ర అలజడి రేపాయి. దీంతో రాష్ట్రం మొత్తం మతపరమైన అంశాలతో హోరెత్తిపోతోంది. వీరి గొడవలోకి ఏకంగా సీఎం జగన్ ను లాగేశారు.
ఇప్పుడీ వివాదం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన.. పార్టీలకు హిందూత్వ సంస్థలు తోడై సీఎం జగన్ న టార్గెట్ చేస్తున్నారు. సీఎం తిరుమల పర్యటనలో టీటీడీ డిక్లరేషన్ ఇవ్వాలంటూ వివాదం మొదలైంది. ఏకంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని ఆయన నివాసాన్ని ముట్టడించే వరకూ వెళ్లింది. పరిస్థితులు ఇలా ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే రోజా కూడా దీనికి మరింత ఆజ్యం పోస్తున్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు అని అంటున్నారు. జగన్ మరో 25 ఏళ్లు సీఎంగా ఉంటారు అని కూడా అంటున్నారు. నేతల వ్యాఖ్యలతో సీఎం జగన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి.
చిన్న విషయాన్ని వైసీపీ నేతలు పెద్దది చేసుకుంటున్నారు. మరోవైపు హిందూత్వ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. బీజేపీ ఏకంగా మతవాదం తీసుకొస్తున్నారు. జగన్ కు తెలిసే పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని పీఠాధిపతులు అంటున్నారు. మరి జగన్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారో చూడాలి.
81893 19978Woh Everyone loves you , bookmarked ! My partner and i take concern within your last point. 938754
719953 865304I tried to submit a comment earlier, although it has not shown up. I will remember this. 253302
567672 569037I discovered your blog internet site on google and examine quite a few of your early posts. Continue to sustain up the superb operate. I merely extra up your RSS feed to my MSN News Reader. In search of forward to reading a lot more from you later on! 173674