Switch to English

భూ రిజిస్ట్రేషన్‌ ధరల మోత: ఇటు ఇచ్చుడు.. అటు లాగుడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,444FansLike
57,764FollowersFollow

ఓ వైపు సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు.. ఇంకోపక్క, ఖాళీ అవుతోన్న ఖజానాని నింపేందుకు ‘బాదుడు’ వ్యవహారాలు.. వెరసి, వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు విమర్శలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్‌ ధరల్ని పెంచుతూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అసలు రాష్ట్రంలో భూముల ధరలు పెరిగితే కదా.. రిజిస్ట్రేషన్‌ ధరల్ని పెంచడానికి.? అన్న చర్చ సాధారణ ప్రజానీకంలో జరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భూముల ధరల్లో ఏమాత్రం పెరుగుదల కన్పించలేదు సరికదా.. గడచిన కొంత కాలంగా ధరలు తగ్గుతున్న పరిస్థితి కూడా కన్పిస్తోంది.

సాధారణంగా భూముల ధరలు పెరుగుతున్నప్పుడు రిజిస్ట్రేషన్‌ ధరల్ని కూడా పెంచుతుంటారు. కానీ, ఇక్కడ పరిస్థితి వేరు. ఖజానా నింపుకోవడానికి సులువైన మార్గంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ధరల పెంపును చూస్తోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

అసలే భూముల అమ్మకాలు జరగక ఇటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. అటు సాధారణ ప్రజానీకం లబోదిబోమంటోన్న వేళ రిజిస్ట్రేషన్‌ ధరలు మరింతగా పెరిగితే, ఈ రంగంలో ముందు ముందు మరింత స్తబ్దత నెలకొంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఊపు రావాలంటే, ఇసుక లభ్యత పెరగాలి. సిమెంట్‌ ధరలూ అందుబాటులో వుండాలి. ఈ అనుకూలతలు రాష్ట్రంలో గత కొంతకాలంగా కన్పించడంలేదు.

పైగా, రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలు.. రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేందుకు సైతం ఏమాత్రం అనుకూలంగా లేకుండా పోయాయి. ‘ఏడాది కాలంగా భూముల ధరలు పెరగడంలేదు సరికదా, తగ్గిపోతున్నాయ్‌.. ధరలు తగ్గినా కొనుగోళ్ళు జరగడంలేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ ధరలు పెరిగితే, అది మరింత చేటు చేస్తుంది..’ అంటూ రియల్‌ రంగానికి చెందిన వ్యాపారులు, వివిధ అవసరాల రీత్యా భూముల్ని అమ్ముకోవాలనుకుంటున్నవారు వాపోతున్నారు.

ప్రధానంగా అమరావతి ప్రాంతంలో అమ్మకాలు, కొనుగోళ్ళు నిలిచిపోవడంతో అక్కడ అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రిజిస్ట్రేషన్‌ ధరల పెంపుతో, ఇప్పటికే పడిపోయిన ప్రభుత్వ ఆదాయం మరింతగా పడిపోయే ప్రమాదం వుందని కూడా రియల్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏదిఏమైనా, ఇటు సంక్షేమ పథకాల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే, ఇంకోపక్క జనం జేబులు గుల్ల చేసేలా ప్రభుత్వం ‘ధరల పెంపుదల’ అన్ని విభాగాల్లోనూ చేపడుతుండడం గమనార్హం. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే పెట్రో ధరలు, మద్యం ధరలు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఎక్కువగా వున్న విషయం విదితమే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...