Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: వైఎస్‌ జగన్‌ రాజధానిని తరలిస్తున్నారా.? లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ‘రాజధాని’ వ్యవహారం సెగలు పుట్టిస్తోంది. ‘మూడు రాజధానుల ఏర్పాటు అంటే, దానర్థం.. ఇప్పటికే రాజధానిగా వున్న అమరావతిని మార్చడం కాదు.. కొత్తగా మరో రెండు రాజధానులను నిర్మించడం అని అర్థం..’ అని చెబుతోంది అధికార వైఎస్సార్సీపీ. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఇదే విషయమై రకరకాల వివరణలు ఇస్తున్నారు.. విపక్షాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, ఇదంతా ‘ఆత్మవంచన’ తప్ప ఇంకోటి కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అయ్యింది. అక్కడే జ్యుడీషియల్‌ రాజధాని.. అక్కడే అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌.. అక్కడే లెజిస్లేచర్‌ క్యాపిటల్‌ ఏర్పాటు కావాల్సి వుంది. కానీ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో, మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తెచ్చింది. అమరావతిలో వున్న ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని విశాఖకు తరలిస్తారు. అమరావతిలోనే వున్న జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ని కర్నూలుకి తరలిస్తారు. సో, ఇది ముమ్మాటికీ రాజధాని తరలింపు మాత్రమే అవుతుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

మరి, వైసీపీ నేతలు ఎందుకు ఆత్మవంచనకు పాల్పడుతున్నారు.? ఇదేమీ మిలియన్‌ డాలర్ల ప్రశ్న కాదు. అధినేత మెప్పు పొందే క్రమంలో, ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప.. రాజధాని విషయంలో వైసీపీ నేతలకు అస్సలేమాత్రం చిత్తశుద్ధి లేదన్నది స్పష్టమైపోయింది. సరే, వైసీపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ నేతలు, ఆ విధానానికి కట్టుబడి వుండొచ్చుగాక. ఆ విషయాన్ని జనానికి స్పష్టం చేయాలి కదా.! మేం రాజధానిని తరలిస్తున్నాం.. అమరావతి నుంచి ఆయా విభాగాల్ని తీసుకుపోతున్నాం.. అమరావతి ఇకపై ఉత్త ‘డొల్ల’ మాత్రమే.. పేరుకు మాత్రమే ఇక్కడ శాసన రాజధాని వుంటుంది.. అని చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు లేకపోవడం శోచనీయమే.

ఏడాది గడిచింది.. అమరావతిలో కావొచ్చు.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కావొచ్చు.. ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్టు ఏదీ చేపట్టలేకపోయింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. అలాంటప్పుడు, మిగిలిన నాలుగేళ్ళలో మూడు రాజధానుల్ని ఎలా నిర్మించగలుగుతుంది.? కరోనా సంక్షోభం దెబ్బకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత ఛిన్నాభిన్నమైపోయిందాయె. కేంద్రం నుంచి రాజధాని / రాజధానులకు సహకారం అందడం అన్నది జరిగే వ్యవహారమే కాదు. మరెలా మూడు రాజధానుల నిర్మాణం జరుగుతుంది.? ఐదేళ్ళకోసారి గద్దెనెక్కేవారు మారితే.. మారిన ప్రతిసారీ రాజధాని మారిపోవాల్సిందేనా.? ‘మాకు రాజదాని లేదు మొర్రో..’ అని రాష్ట్ర ప్రజలు ఇంకెన్నాళ్ళు వేదన అనుభవించాలి.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...