యంగ్ టైగర్ ఎన్టీఆర్, టెంపర్ దగ్గరనుండి కెరీర్ ను పరిగెత్తిస్తున్నాడు. ఆ సినిమా నుండి మొదలుపెట్టి ఎన్టీఆర్ నటించిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులో కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చిత్రాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇద్దరి కాంబినేషన్ లో రీసెంట్ గా వచ్చిన అరవింద సమేత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వీరి తర్వాతి చిత్రంపై ఇప్పటినుండే అంచనాలు బాగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ ఉంటుందని ఇప్పటికే చూచాయిగా తెలిసింది. మైత్రి మూవీస్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ట్వీట్ బట్టి, మైత్రి మూవీస్ ట్వీట్స్ బట్టి ఈ విషయం అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రద్దవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 2 ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఎంతలేదన్నా కెజిఎఫ్ 2 వచ్చే ఏడాది మొదట్లో విడుదలైపోవచ్చు.
కానీ ఎన్టీఆర్ మాత్రం 2022 దాకా ఫ్రీ అయ్యే అవకాశం లేదు. మరి అంతకాలం ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఎదురుచూస్తాడా? ఈలోపు మరో ప్రాజెక్ట్ ఒప్పుకుంటే అప్పుడు ప్రశాంత్ నీల్ ఫ్రీ అవ్వడానికి మరో రెండేళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
295331 635679This site is generally a walk-through you discover the details it suited you about this and didnt know who need to have to. Glimpse here, and you will undoubtedly discover it. 49694
954136 438743Thanks for the auspicious writeup. It actually used to be a leisure account it. Glance complicated to far more delivered agreeable from you! Even so, how can we be in contact? 218364