Switch to English

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్: ‘పితాని’ ముందస్తు జాగ్రత్త.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్ కి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో ఏం జరిగిందో తలచుకుని ఒకింత కంగారుపడుతున్నట్టున్నారు టీడీపీ నేత పితాని సత్యనారాయణ. ఈ కేసులో తన కుమారుడిపైనా ఆరోపణలు రావడంతో, ముందస్తు బెయిల్‌ దిశగా తన కుమారుడ్ని అలర్ట్‌ చేసినట్లే కన్పిస్తోంది. పితాని సత్యనారాయణ తనయుడు సురేష్‌ ముందస్తు బెయిల్‌ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పితాని వద్ద పీఎస్‌గా పనిచేసిన మురళీమోహన్‌ కూడా ముందస్తు బెయిల్‌ కోసం న్యాయస్థానాన్ని అభ్యర్థించడం మరో ఆసక్తికరమైన అంశం.

అయితే, ముందస్తు బెయిల్‌కి సంబంధించి న్యాయస్థానం తీర్పుని రిజర్వ్‌ చేసింది. ‘ఆ స్కామ్ విషయంలో మాకేం సంబంధం లేదు..’ అని ఇప్పటికే పితాని సత్యనారాయణ స్పందించారు. కానీ, తెరవెనుక వ్యవహారాలు వేరేలా వున్నాయి. ‘అచ్చెన్నాయుడికి ఇంకా బెయిల్‌ రాలేదంటే, కేసులో సీరియస్‌నెస్‌ ఎక్కువగానే వున్నట్టు లెక్క..’ అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. ‘అబ్బే, అది అసలు అచ్చెన్నాయుడికి సంబంధం లేని వ్యవహారం..’ అని టీడీపీ అంటోంది.

అచ్చెన్నాయుడిని ముందు పెట్టి తెరవెనుక వ్యవహారాల్ని పితాని సత్యనారాయణ తనయుడు, ఇంకొందరు టీడీపీ నేతల వారసులు నడిపారన్నది వైసీపీ చేస్తోన్న ఆరోపణ. ఈ ఆరోపణల్లో నిజమెంతోగానీ, ‘ముందస్తు బెయిల్‌’ అంశం నేపథ్యంలో ఈ వ్యవహారంలో పితాని సత్యనారాయణ తనయుడి పాత్ర సుస్పష్టయ్యిందని వైసీపీ కుండబద్దలుగొట్టేస్తోంది.

కాగా, ఈ మొత్తం వ్యవహారానికి అసలు సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తనయుడు లోకేష్‌ అనీ, అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే లోకేష్‌కి చిక్కులు తప్పవని వైసీపీ చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా మరింత కలకలం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో మరిన్ని అరెస్టులు వుంటాయనీ, ఇది చాలా పెద్ద స్కామ్ అనీ వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్న విషయం విదితమే. టీడీపీ మాత్రం, ‘అచ్చెన్నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు..’ అని అంటోంది. ఎవరి వాదనలు ఎలా వున్నా, అంతిమంగా తప్పొప్పుల్ని తేల్చాల్సింది న్యాయస్థానమే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...