Switch to English

అమరావతిలో బొత్స టూర్‌ వెనుక ‘రియల్‌’ యాంగిల్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకి తరలించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోన్న విషయం విదితమే. రాష్ట్రం వున్న క్లిష్ట పరిస్థితుల్లో ఒక్క రాజధానిని అభివృద్ధి చేసుకోవడమే కుదరట్లేదు. అలాంటిది, ఏకంగా మూడు రాజధానులంటూ.. ‘ప్రాజెక్ట్‌ అమరావతి’ని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అటకెక్కించింది. గడచిన ఏడాది కాలంలో అమరావతిలో ఒక్క నిర్మాణమూ జరగకపోవడమే ఇందుకు నిదర్శనం.

ఇదిలా వుంటే, ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో పర్యటించారు.. చంద్రబాబు హయాంలో నిర్మితమైన పలు అధికారిక భవనాల్ని ఆయన పరిశీలించారు. అంతకు ముందు ఆయనే, అమరావతిని స్మశానంతో పోల్చారు.. అమరావతిని ముంపు ప్రాంతంగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో బొత్స, అమరావతిలో పర్యటించడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

‘అమరావతిపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సరికొత్త కుట్రకు తెరలేపింది’ అంటూ టీడీపీ ఆరోపిస్తోన్న విషయం విదితమే. ఇక, తాజాగా రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తికరమైన గాసిప్స్‌ అమరావతికి సంబంధించి సర్క్యులేట్‌ అవుతున్నాయి. ‘అమరావతిలో నిర్మితమైన భవనాల్ని విక్రయించేందుకోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాస్తవ ధర కంటే కాస్త తక్కువ ధరకు ఆయా భవనాల్ని విక్రయిస్తే ప్రభుత్వానికి మూడు వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశముంది.. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, అమరావతిపై కొత్త ప్రేమ ప్రదర్శిస్తోంది..’ అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. అందుకే తగ్గట్టే టీడీపీ అనుకూల మీడియాలోనూ కథనాలొస్తున్నాయి.

సోషల్‌ మీడియా వేదికగా అమరావతిపై ఈ అంశం చుట్టూ కుప్పలు తెప్పలుగా పోస్టింగ్స్‌ దర్శనమిస్తున్నాయి. ‘సేవ్‌ అమరావతి’ అంటూ ఆయా అంశాల్ని నెటిజన్లు ప్రస్తావిస్తుండడం గమనార్హం. ఇంతకీ, అమరావతిపై ప్రభుత్వం ఆలోచన ఏంటి.? ‘శాసన రాజధాని మాత్రమే కాదు, అమరావతి మరింత అభివృద్ధి చెందుతుంది.. విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వెళ్ళడం ఒకింత ఆలస్యమయ్యేలా వుంది..’ అంటూ వైసీపీ వర్గాల నుంచి వస్తోన్న ప్రచారంలో నిజమెంత.?

అమరావతిపై కొత్త కుట్ర.. అంటూ టీడీపీ చేస్తోన్న ఆరోపణల్లో నిజమెంత.? ఏమోగానీ, రాజధానిని అమరావతిని తరలించొద్దంటూ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు మాత్రం తమ ఉద్యమాన్ని యధాతథంగా కొనసాగిస్తూనే వున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...