కుల వివక్షలో ఏకంగా ఓ వ్యక్తి తలను.. మొండాన్ని వేరు చేసి 35 కత్తిపోట్లు పొడిచిన దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో జరిగిన ఈ దారుణ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూత్తుకుడి జిల్లా, కీల కీరనుర్ అనే గ్రామంలో ఓ వర్గానికి చెందిన జనాభా ఎక్కువ. వీరికి గ్రామంలో ప్రత్యేకంగా ఓ స్మశానం ఉంది. ఈ స్మశానంలో గత ఏడాది వేరే వర్గంలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పూడ్చి పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి.
దీంతో ఆ మెజార్టీ వర్గం ఎదురు తిరిగింది. అయితే వేరే వర్గంలోని 22ఏళ్ల సత్యమూర్తి దీనిపై ఎదురుతిరిగాడు. వారితో చిన్న సంఘర్షణ అనంతరం అక్కడే మృతదేహం పూడ్చి పెట్టేలా చేశాడు. అప్పటి నుంచి ఆ యువకుడిపై కక్ష పెంచుకుంది ఆ మెజార్టీ వర్గం. గత శుక్రవారం సత్యమూర్తి కోసం కాపు కాసింది ప్రత్యర్ధి వర్గం. ఇంటి నుంచి బయటకు వెళ్లిన సత్యమూర్తి రాత్రి పొద్దుపోయినా రాకపోవటంతో కుమారుడి కోసం గాలించారు తల్లిదండ్రులు. గాలింపులో ఊరికి దూరంగా దాదాపు 400 మీటర్ల దూరంలో సత్యమూర్తి తల లేని మృతదేహం కనిపించింది.
ఆ శరీరంపై దాదాపు 35 కత్తిపోట్లు ఉన్నాయి. విషయం తెలుసుకుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించబోతే గ్రామస్థులు అడ్డుకున్నారు. నిరసనలు పెరిగిపోవడంతో తల కోసం వెదికారు. దీంతో 400 మీటర్ల దూరంలో తల దొరికింది. జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి హంతకులను పట్టుకుంటామని మరో వర్గానికి హామీ ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దీంతో ఆ గ్రామంలో భారీ ఎత్తున పోలిస్ భద్రత ఏర్పాటు చేశారు.
597034 851173I will right away grasp your rss as I can not in obtaining your e-mail subscription hyperlink or e-newsletter service. Do youve any? Kindly permit me realize so that I could subscribe. Thanks. 883807