Switch to English

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారాల్లోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ హైకోర్టు ఎప్పటికప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూనే వుంది. అలా మొట్టికాయ తగిలిన ప్రతిసారీ, ‘టీడీపీ కుట్ర..’ అనడం వైసీపీకి పరిపాటిగా మారిపోయింది. ‘చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో దిట్ట..’ అంటూ నెపం చంద్రబాబు మీద వేసేసి చేతులు దులుపుకుంటున్నారు వైసీపీ నేతలు. చిత్రంగా మంత్రులు కూడా ఇవే తరహా ‘సిల్లీ కామెంట్స్‌’ చేస్తున్నారు.

నిజానికి, న్యాయస్థానాల్లో విన్పించే వాదనల్ని బట్టి.. ఆ వాదనల్లో వాస్తవాన్ని బట్టి తీర్పులు వస్తుంటాయి. ప్రభుత్వం తరఫు వాదనల్లో పస లేకపోవడంతోనే ప్రతిసారీ న్యాయస్తానాల్లో ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్నాయి. వైసీపీ జెండా రంగుల విషయానికొస్తే, న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా ప్రభుత్వంలో మార్పు రావడంలేదు.

అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలంటూ ప్రభుత్వం చేసిన పొలిటికల్‌ పబ్లిసిటీ స్టంట్‌కి కూడా ఇలాగే షాక్‌ తగిలింది. రాజధాని కోసం సేకరించిన భూముల్లోనే ఎందుకు.? వేరే ప్రాంతంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వొచ్చుకదా.? అన్నది లాజిక్‌తో కూడిన ప్రశ్నే. కానీ, ఆ లాజిక్‌ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య వస్తోంది. ఇక, ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలిన ప్రతిసారీ, సోషల్‌ మీడియా వేదికగా వైసీపీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు.. చంద్రబాబుని తూలనాడుతున్నారు.. కొందరైతే న్యాయస్థానాల మీదా అవాకులు చెవాకులు పేలడానికి వెనుకాడటంలేదు.

వైసీపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిది¸, ఇటీవల న్యాయస్థానంపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారాన్ని పెట్టీ కేసుగా కొట్టి పారేశారాయన. ఏ కేసు ఎలాంటిదో హైకోర్టుకి ఓ ప్రజా ప్రతినిది¸.. పైగా అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పాఠాలు చెబుతాడా.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం.

‘ప్రభుత్వం దగ్గర సరైన సలహాదారులు లేరు.. న్యాయస్థానంలో వాదనలు విన్పించాల్సిన విభాగం కూడా సమర్థవంతంగా పనిచేయడంలేదు.. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి పదే పదే మొట్టికాయలు పడటానికి ఇదీ ఓ కారణమే..’ అని ఓ రాజకీయ పరిశీలకుడు తన అభిప్రాయాన్ని ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో వెల్లడించడం గమనార్హం. మొత్తమ్మీద, తమ వైఫల్యాలను గుర్తెరగకుండా.. వైసీపీ శ్రేణులు.. టీడీపీకి పరోక్షంగా క్రెడిట్ ఇచ్చి, వారిని టార్గెట్ చేస్తుండడం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...