ఇద్దరు కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కర్కశుడయ్యాడు. తండ్రిగా విద్యాబుద్దులు చెప్పించి, పెద్ద చేయాల్సిన బాధ్యతను విస్మరించాడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సింది తాగిన మత్తులో కాటికి చేర్చాడు. విషాదకరమైన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో సంత్ కబీర్ నగర్ పీఎస్ పరిధిలో ఈనెల 25న జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బనేతు గ్రామానికి చెందిన జైనుల్ కు పెళ్లై ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. భార్యతో విడాకులు తీసుకున్నాడు. కానీ.. పిల్లలు మాత్రం తండ్రి వద్దనే ఉంటున్నారు. వీరిలో ఓ చిన్నారికి 5ఏళ్లు, మరో చిన్నారికి 3ఏళ్లు. ప్రతి రోజూ తాగి ఇంటికి వచ్చే జైనుల్ చిన్నారులని కూడా చూడకుండా వారిని కొట్టేవాడు.
రోజూలానే తప్పతాగి ఇంటికొచ్చిన జైనుల్ కు పిల్లలిద్దరూ ఇంటి బయట ఆడుకోవడం కనిపించింది. ఇంట్లోకి రావాలన్న తన మాట వినలేదని ఒళ్లూపై తెలియని కోపంతో ఊగిపోయాడు. అక్కడే ఉన్న ఓ పెద్ద ఇటుక తీసుకుని వారిద్దని తీవ్రంగా కొట్టాడు. దీంతో చిన్నారులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. జైనుల్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడని.. ఇద్దరు పిల్లలను అడ్డు తొలగించుకోవాలనే వారిని హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జైనుల్ పై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టామని అసిస్టెంట్ సూపరిండెంట్ శ్రీవాస్తవ తెలిపారు.
515313 420388Dead composed topic matter, thanks for data . 394086