భాగమతి సినిమా తర్వాత అనుష్క చేసిన సినిమా నిశ్శబ్దం. ఈ సినిమా గత ఏడాదే విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ ఏడాది మొదట్లో విడుదల చేయాలనుకుంటే ఎదో సమస్యతో సమ్మర్ కు వాయిదా వేశారు. కానీ ఇప్పుడు సినిమా విడుదల అయ్యే పరిస్థితికి కనిపించడం లేదు.
నిర్మాతలు ఆర్ధికంగా చాలా లాస్ అవ్వాల్సి వస్తుందని థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయడం కష్టం అని నిర్ణయించుకుని ఓటిటి లో విడుదలకు సిద్ధం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై అనుష్క ను సోషల్ మీడియా ద్వారా స్పందించమనగా ఓటిటి విడుదల విషయంలో తన నిర్ణయం ఏమి లేదని క్లారిటీ ఇచ్చింది.
సినిమాలో నటించడం వరకే నా పని. విడుదల విషయంలో నా ప్రమేయం ఏమి ఉండదు. ఎప్పుడు ఎలా రిలీజ్ చేయాలి అనేది వారి ఇష్టం. నేను విడుదల విషయంలో కండిషన్స్ పెట్టను అంది. దాంతో నిశ్శబ్దం సినిమా ఓటిటి విడుదలకు రూట్ క్లియర్ అయినట్లయింది. ఈ సినిమాలో అంజలి, మాధవన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
547170 490811Paper rolls really excellent read you know alot about this topic i see! 155110