పేదల బతుకులను ఛిద్రం చేసే లాటరీ వ్యవస్థను తీసుకురావడానికి ఏపీలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా? ఆదాయాన్ని పెంపొందించుకునే విషయంలో ఈ మేరకు లాటరీ వ్యవస్థను పునరుద్ధరించడానికి కసరత్తు జరుగుతోందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. విభజన తర్వాత లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ.. అనంతరం పలు సంక్షేమ పథకాల కోసం పాలకులు భారీగా వెచ్చించడంతో పీకల్లోతు అప్పల్లో కూరుకుపోయింది. చంద్రబాబు గద్ద దిగే సరికి దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పులు ఉండగా.. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ కూడా అప్పులు తేక తప్పని పరిస్థితి నెలకొంది.
మరోవైపు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయల్సిన బాధ్యత జగన్ పై ఉంది. మద్యం షాపులను దశలవారీగా తగ్గిస్తామని, నాలుగేళ్లలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని ప్రకటించిన జగన్.. ఆ దిశగా ముందుకు వెళ్లాల్సి ఉంది. అదే జరిగితే మద్యం ద్వారా వచ్చే కోట్ల రూపాయల ఆదాయం కోల్పోక తప్పదు. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్న ఏపీకి ఇది పెద్ద దెబ్బే అవుతుంది. ఈ నేపథ్యంలో మద్యం ద్వారా కోల్పోతున్న ఆదాయాన్ని మరో మార్గంలో పొందాలని భావిస్తున్న ఏపీ సర్కారు.. లాటరీని మళ్లీ ప్రవేశపెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు కేరళలో లాటరీలు నడుస్తున్నాయి.
వీటి ద్వారా ఆయా ప్రభుత్వాలకు భారీగానే ఆదాయం సమకూరుతోంది. గతంలో ఏపీలో కూడా లాటరీ వ్యవస్థ ఉండేది. అయితే, పేదలు వీటికి బానిసలుగా మారి నష్టపోతుండటంతో నిషేధం విధించారు. మళ్లీ ఆదాయ పెంపు మార్గాల్లో భాగంగా దీనివైపు ఏపీ ఆసక్తి చూపిస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ కేరళలో అమలవుతున్న లాటరీ విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
890512 601793Some truly great info , Gladiola I found this. 899578
569353 168785Pay a visit to our site for details about securities based lending and a lot more. There is info about stock and equity loans as nicely as application forms. 508074