Switch to English

కరోనా ఫ్రెండ్లీ.. జగన్‌ సర్కార్‌పై పవన్‌ సెటైర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, కరోనా వైరస్‌ నేపథ్యంలో అధికార పక్షంపై రాజకీయ విమర్శలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. అయితే, ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం.. ప్రజలకు హాని చేస్తోంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించి తీరాల్సిందే గనుక, తనదైన స్టయిల్లో జనసేనాని ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో మద్యంపై నిషేధం విధిస్తామని చెప్పి, ఇప్పుడు కరోనా వైరస్‌ నేపథ్యంలో మద్యం దుకాణాల్ని తెరవడమేంటని ప్రశ్నించారు జనసేనాని.

‘కరోనా వైరస్‌ ఫ్రెండ్లీ..’ అంటూ అధికార పక్షంపై జనసేనాని సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డారు. నిజమే, కరోనా వైరస్‌ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించారన్నది నిర్వివాదాంశం. చిత్తూరు జిల్లాల్లో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిది¸ అత్యుత్సాహం, చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్ని రెడ్‌ జోన్‌లోకి నెట్టివేసిన విషయం విదితమే. సదరు ప్రజా ప్రతినిది¸కి న్యాయస్థానం తాజాగా నోటీసులు జారీ చేసింది కూడా. మరో నలుగురు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులకూ నోటీసులు వెళ్ళాయి.

ఇదిలా వుంటే, కరోనా వైరస్‌ నేపథ్యంలో సోషల్‌ డిస్టెన్సింగ్‌ని పాటించాలని చెబుతున్న ప్రభుత్వమే, మద్యం దుకాణాల్ని తెరవడం శోచనీయం. 40 రోజులకు పైగా మూసివున్న దుకాణాలు ఒక్కసారిగా తెరుచుకోవడంతో, మందుబాబులు పోటెత్తారు. విచక్షణ మర్చిపోయారు. వారిని అదుపు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. అత్యంత హేయంగా, ప్రభుత్వ టీచర్లకు మద్యం షాపుల వద్ద ‘కరోనా డ్యూటీలు’ వేయడం గమనార్హం. వ్యవస్థల పట్ల వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధిని ఈ ఘటన చెప్పకనే చెబుతుంది. రాష్ట్రంలో నిన్న మద్యం షాపుల వద్ద కన్పించిన క్యూ లైన్లు, తోపులాటలు చూస్తే.. వీళ్ళంతా కరోనా వాహకులుగా మారి, రాష్ట్రాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేయడం ఖాయమన్న భావన కలగకుండా వుండదు.

నలభై రోజులు ఆగిన మందుబాబుల్ని మరికొన్ని రోజులు అలాగే ఆపాల్సిన ప్రభుత్వం, ఖజానా నింపుకోవడం కోసం మద్యం దుకాణాల్ని తెరవడమంటే.. రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నట్లు.? ఇదే విషయాన్ని జనసేన అధినేత ప్రశ్నించారు. భారత మాజీ ప్రెసిడెంట్‌ సర్వపల్లి రాధాకృష్ణన్‌ ఆత్మ ఘోషిస్తుందనీ, టీచర్లను లిక్కర్‌ షాపుల వద్ద కాపలా పెట్టడమేంటన్న జనసేనాని ప్రశ్నలో నూటికి నూరుపాళ్ళూ నిజాయితీ కన్పిస్తోంది.. సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతను చెప్పకనే చెబుతోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...