ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో అన్ని వర్గాల వారు, అన్ని రకాల పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితం అవుతున్న విషయం తెల్సిందే. కరోనా విపత్తు నేపథ్యంలో ప్రతి ఒక్కరు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు వారికి ఏదో ఒకరకంగా సాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వంతో పాటు స్వచ్చంద సంస్థలు మరియు ఎన్జీఓస్ కూడా ఈ సమయంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. సినిమా పరిశ్రమలో కొన్ని వేల మంది సినీ కార్మికులు షూటింగ్స్ లేకపోవడంతో తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. గత రెండు నెలలుగా షూటింగ్స్ పూర్తిగా బంద్ అయ్యాయి.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్లో సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి షూటింగ్స్కు అనుమతించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా సినీ వర్గాల వారితో కలిసి మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ జూన్ నుండి షూటింగ్స్ కు అనుమతించే అవకాశం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ ఒక ప్రాంతం, ఒక నగరం అని కాకుండా ప్రపంచం మొత్తంను ఇబ్బంది పెడుతోంది. తెలుగు సినిమా పరిశ్రమపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. చిత్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది జీవనం సాగిస్తున్నారు. షూటింగ్స్లో పాల్గొనే కార్మికులు, థియేటర్లలో పని చేసే ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తు కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి ప్రభుత్వం సాధ్యం అయినంత వరకు సాయం చేసింది. కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే సాయంను అందించాం.
నేడు జరుగబోతున్న క్యాబినేట్ మీటింగ్లో కూడా సినిమా పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చిస్తాం. షూటింగ్స్ విషయమై ఒక నిర్ణయం తీసుకుంటాం. చిత్ర పరిశ్రమ మొత్తం ఏకం అయ్యి సీసీసీ ఏర్పాటు చేసి సినీ కార్మికులకు మద్దతుగా నిలవడం అభినందనీయం. ఇప్పటి వరకు సీసీసీ 14 వేల మందికి నిత్యావసరాలు అందించినట్లుగా వారు చెప్పారు. చిత్ర పరిశ్రమకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది.
తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినా కూడా హైదరాబాద్లో తెలుగు సినిమా పరిశ్రమ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగడంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. తెలుగు సినిమా పరిశ్రమను మరింతగా అభివృద్ది చేసే ఉద్దేశ్యంతో చిరంజీవి, నాగార్జున గార్లతో ఇప్పటికే మూడు సార్లు భేటీ అయ్యాం. ఈ సమయంలోనే కరోనా రావడంతో కొత్త పాలసీలను తీసుకు రాలేక పోయాం.
కరోనా పోయాక అయినా కొత్త పాలసీలతో మీ ముందుకు వస్తాం. లాక్ డౌన్ తర్వాత మరోసారి సినీ ప్రముఖులతో భేటీ అయ్యి ఇండస్ట్రీకి ఏం చేయాలనే విషయమై చర్చిస్తామని తలసాని అన్నారు.
లాక్ డౌన్ తర్వాత థియేటర్ల ఓపెన్ విషయమై నిర్మాతలతో చర్చిస్తాం. సామాజిక దూరం పాటించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం.
నిర్మాతలు తీసుకున్న బ్యాంకు లోన్లపై మారటోరియం విషయంలో బ్యాంకర్లతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోలేం, ఇప్పుడే అనుమతులు ఇవ్వలేం.
షూటింగ్స్ కోసం మరో నెల రోజులు ఓపిక పట్టండి. జూన్ నుండి అంతా సాదారణ స్థితికి వస్తే హ్యాపీగా షూటింగ్స్ చేసుకోవచ్చు.
సినిమా పరిశ్రమలో కార్మికుల కష్టాలు తాత్కాలికమే. మళ్లీ సినిమాల మేకింగ్ మొదలు అయితే వారు ఇబ్బందుల నుండి బయట పడతారంటూ తలసాని అభిప్రాయం వ్యక్తం చేశారు.
689144 122368Someone essentially assist to make severely posts I might state. That could be the very first time I frequented your website page and so far? I surprised with the analysis you made to create this specific submit incredible. Magnificent task! 53716
553249 430434It is perfect time to make some plans for the future and it is time to be happy. Ive read this post and if I could I wish to suggest you some interesting points or suggestions. Possibly you can write next articles referring to this post. I want to read even far more issues about it! 812954