Switch to English

ఆంధ్రప్రదేశ్‌పై కరోనా పంజా.. ప్రభుత్వం ఏం చేస్తోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా మిలియన్‌ జనాభాకి అత్యధికంగా కరోనా వైరస్‌ (కోవిడ్‌19) పరీక్షలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో కరోనా పాజిటివ్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య చాలా ఎక్కువ. తమిళనాడుతో పోల్చితే మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కాస్త బెటర్‌.

ఒక్క విజయనగరం జిల్లా మినహాయిస్తే, రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ కరోనా ప్రభావనికి గురయ్యాయి. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న విషయం విదితమే. చిత్తూరు జిల్లాలో కేసులకి కారణం అధికార వైఎస్సార్సీపీకి చెందిన నేతలేనన్న విమర్శ వుంది. ఇతర జిల్లాల్లోనూ వైసీపీ నేతల అత్యుత్సాహమే కరోనా వ్యాప్తికి కారణమన్న వాదనలు లేకపోలేదు.

ఇదిలా వుంటే, మొదటి నుంచీ కరోనా వైరస్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ‘నిర్లక్ష్యం’ ప్రదర్శిస్తూ వచ్చిందన్నది నిర్వివాదాంశం. కరోనా వైరస్‌ కారణంగా ముంచుకొస్తోన్న ప్రమాదాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం లైట్‌ తీసుకుంది. స్థానిక ఎన్నికల మీదనే వైసీపీ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టిందన్నది నిర్వివాదాంశం. ఈ క్రమంలో నానా యాగీ జరిగిందనుకోండి.. అది వేరే విషయం.

‘పారాసిటమాల్‌ – బ్లీచింగ్‌’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజానీకం కూడా కరోనా వైరస్‌ని లైట్‌ తీసుకున్నారు. అదే, రాష్ట్రంపై కరోనా పంజా విసరడానికి కారణంగా చెప్పుకోవచ్చు. తాజాగా ఈ రోజు 81 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దాంతో లెక్క మరింత పరిగింది. ఇప్పటికే వెయ్యి దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు కొద్ది రోజుల్లోనే 2 వేలకు చేరుతాయా.? అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఓ వ్యక్తి కారణంగా 20 మందికి పైగా వ్యక్తులు కరోనా బారిన పడ్డారని ప్రభుత్వమే చెబుతుండడంతో, ఈ వ్యాప్తి గ్రౌండ్‌ లెవల్‌లో ఇంకెంత దారుణంగా వుందోననే ఆందోళన వ్యక్తమవడం సహజమే. పరీక్షలు ఎక్కువ చేస్తుండడం మంచిదే అయినా, దాని పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేయాలనుకోవడం దురదృష్టకరం. అనుమానిత లక్షణాలున్నవారితోపాటు, వారి సన్నిహితులకి పరీక్షలు చేయడం మంచిదే.

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కోరోనా పాజిటివ్‌ కేసుల నమోదు గణనీయంగా తగ్గింది. దానర్థం, అసలు పరీక్షలే జరగడంలేదని అంటే ఎలా.? తెలంగాణ ప్రభుత్వం, మొదటి నుంచీ కరోనా వైరస్‌ విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే, ఆ సీరియస్‌నెస్‌ పూర్తిగా కొరవడటమే.. ఇప్పుడీ దుస్థితికి కారణం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...