Switch to English

నిమ్మగడ్డ దొరికినట్టేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అధికార పార్టీ నేతల ఆరోపణలకు తగినట్టుగానే ఈ లేఖ వెనుక ఏదో మతలబు దాగి ఉందని నిర్ధారణ అవుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు డీఐజీ గౌతం సవాంగ్ దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీకి కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. నిమ్మగడ్డ వద్ద సహాయ కార్యదర్శిగా పనిచేసిన సాంబమూర్తి ఈ విచారణలో కీలకంగా మారారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. లేఖ పంపించిన తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేశారు. తొలుత ల్యాప్ టాప్ ఉన్న లేఖను పెన్ డ్రైవ్ ద్వారా డెస్క్ టాప్ లోకి వేసి, అక్కడ నుంచి వాట్సాప్ వెబ్ ద్వారా నిమ్మగడ్డ మొబైల్ కు పంపించారు. ఆయన దానిని కేంద్ర హోంశాఖకు ఫార్వార్డ్ చేశారని సాంబమూర్తి విచారణలో అంగీకరించారు. అనంతరం లాప్ టాప్ లో లేఖ డిలీట్ చేసి, పెన్ డ్రైవ్ ను ధ్వంసం చేశారు. డెస్క్ టాప్ ను కూడా మూడు సార్లు ఫార్మాట్ చేసినట్టు వెల్లడించారు. దీనిని బట్టి ఈ లేఖ వెనుక ఏదో గూడుపుఠాణీ ఉందని అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.

తాము చెబుతున్నట్టుగా ఈ లేఖ టీడీపీ కార్యాలయంలోనే తయారైందని వారు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం డెస్క్ టాప్ ను స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు రికవరీ టూల్స్ ద్వారా అందులోని సమాచారాన్ని వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమాచారం మొత్తం బయటకు వస్తే.. లేఖ వెనుక ఎవరి హస్తం ఉందనేది తెలుస్తుంది. నిజానికి ఈ లేఖ తొలుత టీడీపీ అనుకూల మీడియా ద్వారానే బయటకు వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న వ్యక్తి కేంద్ర హోంశాఖకు భద్రత కోరుతూ లేఖ రాసి, దానిని తన మొబైల్ ద్వారా పంపిస్తే.. మీడియాలో వచ్చే అవకాశం ఉండదు. కానీ లేఖ మొత్తం యథాతథంగా పతాక శీర్షికల్లో వచ్చేసింది. అంటే.. ఆ లేఖను ఉద్దేశపూర్వకంగా ఎవరో విడుదల చేసి ఉంటారని తెలుస్తోంది. అదే సమయంలో ఆ లేఖ మీరే రాశారా అని ఈనాడు విలేకరి అడిగితే నిమ్మగడ్డ ధ్రువీకరించలేదు.

ఏఎన్ఐ వార్తాసంస్థ అడిగినప్పుడు తాను రాయలేదని నిమ్మగడ్డ బదులిచ్చారు. మీడియాలో ఈ లేఖపై రచ్చ జరిగినన్ని రోజులు కూడా ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కానీ లేఖపై దర్యాప్తు జరిపించాలని అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేయగానే.. తానే ఆ లేఖ రాశానంటూ నిమ్మగడ్డ స్పందించారు. ఇది కూడా కాస్త ఆలోచించాల్సిన విషయమేనని వైసీపీ నేతలంటున్నారు. పైగా ఆ లేఖ ఓ బ్యూరో క్రాట్ రాసినట్టుగా లేదు. ఫక్తు రాజకీయ పార్టీ చేసే ఆరోపణలతోనే అదంతా నిండిపోయి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ లేఖ ఎవరు రాశారనే చర్చ జరుగుతున్నా నిమ్మగడ్డ మిన్నకుండిపోయారని.. కానీ దర్యాప్తునకు ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తానే రాశానని అంగీకరించాల్సి వచ్చిందని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

సాధారణ ప్రక్రియలో భాగంగా నిమ్మగడ్డే ఆ లేఖ రాసి ఉంటే.. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు లేఖ నెంబరు, నిమ్మగడ్డ పంపిన లేఖ నెంబరు ఒకటే కావడం కూడా గమనించాల్సిన విషయమని పేర్కొంటున్నారు. డెస్క్ టాప్ లోని ఆధారాలు రికవరీ అయితే, అసలు నిజాలు బయటకు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఈ లేఖ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని సర్వత్రా చర్చ జరుగుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...