బిగ్ షాక్: డేంజర్ గా మారుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకి మందు ఇంకా కనిపెట్టలేదు. కానీ మలేరియాకి ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ కొంతవరకూ కరోనా కట్టడిని చేయడంలో ఉపయోగపడుతుందని తెలిసి ఇతర దేశాల రిక్వెస్ట్ మేరకు, అమెరికా మరియు కొన్ని యూరప్ కంట్రీస్ కి మెడిసిన్ పంపింది ఇండియా. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) హైడ్రాక్సీ క్లోరోక్విన్పై పరిశోధన చేసి కరోనా రోగులకు ఈ మెడిసిన్ ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని అమెరికాని హెచ్చరించింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకం వల్ల గుండె సంబంధిత వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని ఎఫ్డీఏ చీఫ్ ఎమ్. స్టీఫెన్ ఓ ప్రకటక ద్వారా తెలిపారు. దాంతో అమెరికాలో అత్యవసర సందర్భాల్లో మాత్రేమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడాలని ఆర్డర్ పాస్ చేసింది. ఇన్నాళ్లు అదొక్కటే మందు అని ఆనందపడుతున్న వారికి ఇది ఒక చేదు వార్త.
ఏపీలో 1000 దాటిన కరోనా కేసులు..
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 61 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదవ్వగా ఇద్దరు మరణించారు. దాంతో రాష్ట్రంలో 1016కి చేరిన కరోనా కేసులు. కర్నూలు 14, గుంటూరు 3, అనంతపురం 5, తూర్పు గోదావరి 3, కృష్ణా 25, కడప 4, నెల్లూరు 4 చొప్పున కొత్తగా పాజిటీవ్ కేసులు నమోదు కాగా గత నెలరోజులుగా ఒక్క కేసు కూడా లేని శ్రీకాకుళం జిల్లాలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
శ్రీకాకుళంకి కూడా కరోనా అంటించిన వైసీపీ నేతల పబ్లిసిటీ పిచ్చి.!
ఏపీ అసెంబ్లీ స్పీకర్, వైసీపీ నేత లాక్ డౌన్ ని ఉల్లంఘించి శ్రీకాకుళంలో కనీస జాగత్తలు కూడా పాటించకుండా పబ్లిక్ మీటింగ్ పెట్టి అక్కడి ప్రజల్ని కరోనా బారిన పడేటట్టు చేశారు. నేడు రిలీజ్ చేసిన తా హెల్త్ బులిటెన్ ప్రకారం గత నెలరోజులుగా ఒక్క కరోనా కేసు కూడా లేకుండా కరోనా రహిత జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో నేడు 3 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏ మాత్రం విచక్షణ లేకుండా లాక్ డౌన్ టైంలో చీప్ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్న వైసీపీ నేతలు ప్రజలకి కరోనా అంటిస్తున్నారు. కరోనా రహిత జిల్లాలని కరోనా బారిన పడేలా చేస్తున్నారు.
#coronavirus కి కారణం,మానవుడు నాగరికత పేరుతో పెచ్చుమీరిపోయిన అనాగరిక చర్య-స్పీకర్ తమ్మినేని
సారూ #Lockdown2 టైంలో ఇలా మీటింగ్స్ పెట్టి ప్రజలకి #Corona అంటించడం నాగరికతా??
మితిమీరిన పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్న @YSRCParty నేతల్ని ప్రశ్నించారా? @JanaSenaParty @JaiTDP @BJP4Andhra pic.twitter.com/SG3mEnTQa3
— TeluguBulletin.com (@TeluguBulletin) April 24, 2020