ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అధికార పార్టీ నేతల ఆరోపణలకు తగినట్టుగానే ఈ లేఖ వెనుక ఏదో మతలబు దాగి ఉందని నిర్ధారణ అవుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు డీఐజీ గౌతం సవాంగ్ దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీకి కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. నిమ్మగడ్డ వద్ద సహాయ కార్యదర్శిగా పనిచేసిన సాంబమూర్తి ఈ విచారణలో కీలకంగా మారారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. లేఖ పంపించిన తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేశారు. తొలుత ల్యాప్ టాప్ ఉన్న లేఖను పెన్ డ్రైవ్ ద్వారా డెస్క్ టాప్ లోకి వేసి, అక్కడ నుంచి వాట్సాప్ వెబ్ ద్వారా నిమ్మగడ్డ మొబైల్ కు పంపించారు. ఆయన దానిని కేంద్ర హోంశాఖకు ఫార్వార్డ్ చేశారని సాంబమూర్తి విచారణలో అంగీకరించారు. అనంతరం లాప్ టాప్ లో లేఖ డిలీట్ చేసి, పెన్ డ్రైవ్ ను ధ్వంసం చేశారు. డెస్క్ టాప్ ను కూడా మూడు సార్లు ఫార్మాట్ చేసినట్టు వెల్లడించారు. దీనిని బట్టి ఈ లేఖ వెనుక ఏదో గూడుపుఠాణీ ఉందని అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.
తాము చెబుతున్నట్టుగా ఈ లేఖ టీడీపీ కార్యాలయంలోనే తయారైందని వారు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం డెస్క్ టాప్ ను స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు రికవరీ టూల్స్ ద్వారా అందులోని సమాచారాన్ని వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమాచారం మొత్తం బయటకు వస్తే.. లేఖ వెనుక ఎవరి హస్తం ఉందనేది తెలుస్తుంది. నిజానికి ఈ లేఖ తొలుత టీడీపీ అనుకూల మీడియా ద్వారానే బయటకు వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న వ్యక్తి కేంద్ర హోంశాఖకు భద్రత కోరుతూ లేఖ రాసి, దానిని తన మొబైల్ ద్వారా పంపిస్తే.. మీడియాలో వచ్చే అవకాశం ఉండదు. కానీ లేఖ మొత్తం యథాతథంగా పతాక శీర్షికల్లో వచ్చేసింది. అంటే.. ఆ లేఖను ఉద్దేశపూర్వకంగా ఎవరో విడుదల చేసి ఉంటారని తెలుస్తోంది. అదే సమయంలో ఆ లేఖ మీరే రాశారా అని ఈనాడు విలేకరి అడిగితే నిమ్మగడ్డ ధ్రువీకరించలేదు.
ఏఎన్ఐ వార్తాసంస్థ అడిగినప్పుడు తాను రాయలేదని నిమ్మగడ్డ బదులిచ్చారు. మీడియాలో ఈ లేఖపై రచ్చ జరిగినన్ని రోజులు కూడా ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కానీ లేఖపై దర్యాప్తు జరిపించాలని అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేయగానే.. తానే ఆ లేఖ రాశానంటూ నిమ్మగడ్డ స్పందించారు. ఇది కూడా కాస్త ఆలోచించాల్సిన విషయమేనని వైసీపీ నేతలంటున్నారు. పైగా ఆ లేఖ ఓ బ్యూరో క్రాట్ రాసినట్టుగా లేదు. ఫక్తు రాజకీయ పార్టీ చేసే ఆరోపణలతోనే అదంతా నిండిపోయి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ లేఖ ఎవరు రాశారనే చర్చ జరుగుతున్నా నిమ్మగడ్డ మిన్నకుండిపోయారని.. కానీ దర్యాప్తునకు ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తానే రాశానని అంగీకరించాల్సి వచ్చిందని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
సాధారణ ప్రక్రియలో భాగంగా నిమ్మగడ్డే ఆ లేఖ రాసి ఉంటే.. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు లేఖ నెంబరు, నిమ్మగడ్డ పంపిన లేఖ నెంబరు ఒకటే కావడం కూడా గమనించాల్సిన విషయమని పేర్కొంటున్నారు. డెస్క్ టాప్ లోని ఆధారాలు రికవరీ అయితే, అసలు నిజాలు బయటకు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఈ లేఖ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
682917 224098Some actually wonderful information , Gladiola I found this. 942729
362793 956896Some truly interesting info , properly written and loosely user genial . 539300
971523 502560I discovered your weblog website internet web site on the internet and appearance some of your early posts. Continue to keep inside the wonderful operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far far more from you finding out at a later date! 605674
568779 417246Some truly nice stuff on this site , I like it. 821156