Switch to English

నిమ్మగడ్డ దొరికినట్టేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అధికార పార్టీ నేతల ఆరోపణలకు తగినట్టుగానే ఈ లేఖ వెనుక ఏదో మతలబు దాగి ఉందని నిర్ధారణ అవుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు డీఐజీ గౌతం సవాంగ్ దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీకి కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. నిమ్మగడ్డ వద్ద సహాయ కార్యదర్శిగా పనిచేసిన సాంబమూర్తి ఈ విచారణలో కీలకంగా మారారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. లేఖ పంపించిన తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేశారు. తొలుత ల్యాప్ టాప్ ఉన్న లేఖను పెన్ డ్రైవ్ ద్వారా డెస్క్ టాప్ లోకి వేసి, అక్కడ నుంచి వాట్సాప్ వెబ్ ద్వారా నిమ్మగడ్డ మొబైల్ కు పంపించారు. ఆయన దానిని కేంద్ర హోంశాఖకు ఫార్వార్డ్ చేశారని సాంబమూర్తి విచారణలో అంగీకరించారు. అనంతరం లాప్ టాప్ లో లేఖ డిలీట్ చేసి, పెన్ డ్రైవ్ ను ధ్వంసం చేశారు. డెస్క్ టాప్ ను కూడా మూడు సార్లు ఫార్మాట్ చేసినట్టు వెల్లడించారు. దీనిని బట్టి ఈ లేఖ వెనుక ఏదో గూడుపుఠాణీ ఉందని అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.

తాము చెబుతున్నట్టుగా ఈ లేఖ టీడీపీ కార్యాలయంలోనే తయారైందని వారు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం డెస్క్ టాప్ ను స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు రికవరీ టూల్స్ ద్వారా అందులోని సమాచారాన్ని వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమాచారం మొత్తం బయటకు వస్తే.. లేఖ వెనుక ఎవరి హస్తం ఉందనేది తెలుస్తుంది. నిజానికి ఈ లేఖ తొలుత టీడీపీ అనుకూల మీడియా ద్వారానే బయటకు వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న వ్యక్తి కేంద్ర హోంశాఖకు భద్రత కోరుతూ లేఖ రాసి, దానిని తన మొబైల్ ద్వారా పంపిస్తే.. మీడియాలో వచ్చే అవకాశం ఉండదు. కానీ లేఖ మొత్తం యథాతథంగా పతాక శీర్షికల్లో వచ్చేసింది. అంటే.. ఆ లేఖను ఉద్దేశపూర్వకంగా ఎవరో విడుదల చేసి ఉంటారని తెలుస్తోంది. అదే సమయంలో ఆ లేఖ మీరే రాశారా అని ఈనాడు విలేకరి అడిగితే నిమ్మగడ్డ ధ్రువీకరించలేదు.

ఏఎన్ఐ వార్తాసంస్థ అడిగినప్పుడు తాను రాయలేదని నిమ్మగడ్డ బదులిచ్చారు. మీడియాలో ఈ లేఖపై రచ్చ జరిగినన్ని రోజులు కూడా ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కానీ లేఖపై దర్యాప్తు జరిపించాలని అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేయగానే.. తానే ఆ లేఖ రాశానంటూ నిమ్మగడ్డ స్పందించారు. ఇది కూడా కాస్త ఆలోచించాల్సిన విషయమేనని వైసీపీ నేతలంటున్నారు. పైగా ఆ లేఖ ఓ బ్యూరో క్రాట్ రాసినట్టుగా లేదు. ఫక్తు రాజకీయ పార్టీ చేసే ఆరోపణలతోనే అదంతా నిండిపోయి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ లేఖ ఎవరు రాశారనే చర్చ జరుగుతున్నా నిమ్మగడ్డ మిన్నకుండిపోయారని.. కానీ దర్యాప్తునకు ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తానే రాశానని అంగీకరించాల్సి వచ్చిందని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

సాధారణ ప్రక్రియలో భాగంగా నిమ్మగడ్డే ఆ లేఖ రాసి ఉంటే.. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు లేఖ నెంబరు, నిమ్మగడ్డ పంపిన లేఖ నెంబరు ఒకటే కావడం కూడా గమనించాల్సిన విషయమని పేర్కొంటున్నారు. డెస్క్ టాప్ లోని ఆధారాలు రికవరీ అయితే, అసలు నిజాలు బయటకు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఈ లేఖ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని సర్వత్రా చర్చ జరుగుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...