యంగ్ హీరో నితిన్ చాలా కాలం తర్వాత భీష్మ చిత్రంతో సక్సెస్ను దక్కించుకున్న విషయం తెల్సిందే. అఆ తర్వాత సాలిడ్ సక్సెస్ లేకపోవడంతో అల్లాడుతూ ఉన్న నితిన్కు భీష్మతో సక్సెస్ అందింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న నటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి సీజన్ తర్వాత విడుదలైన ఈ చిత్రంకు కమర్షియల్గా కూడా మంచి వసూళ్లను రాబట్టింది.
కాస్త ఆలస్యం అయ్యి ఉంటే కరోనా దెబ్బ ఈ సినిమాకు దెబ్బ గట్టిగా బాగా పడేది. అదృష్టం కొద్ది కరోనా ఆరంభంకు ముందే ఈ సినిమా వచ్చేసి పోయింది. ఇప్పుడు మరో లక్ ఏంటీ అంటే తాజాగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. లాక్డౌన్తో అంతా ఇంటికే పరిమితం అయిన నేపథ్యంలో సినిమాకు మంచి వ్యూవర్స్ వచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అన్నింటి కంటే ఈ సినిమానే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఓటీటీ పై మొన్నటి వరకు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు భీష్మ చిత్రం ట్రెండ్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. థియేటర్ల ద్వారా భారీగా ఆధాయం రాబట్టిన భీష్మ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారా కూడా మంచి లాభాలను తెచ్చి పెడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక నితిన్ ఈ సమ్మర్లో రంగ్దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు. కాని లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. అది వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉంది అంటున్నారు.
440998 87465But yet another intelligent weblog! Completely cannot wait for a good deal far more! 102263