Switch to English

రంగుల రాజీకీయంలోకి బీజేపీని లాగుతున్న వైసీపీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

ఏపీలో ప్రభుత్వ భవనాలకు పార్టీ జెండాలను పోలిన రంగులను తొలగించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అధికార పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మూడు వారాల్లోగా ఆ రంగులన్నీ తొలగించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ భవనాలకు దాదాపు రూ.1400 కోట్లు వెచ్చించి వేసిన వైసీపీ రంగులు తొలగించి కొత్త రంగులు వేయాలంటే మరో రూ.1400 కోట్లు కావాలని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అంత మొత్తం వెచ్చించడం తలకు మించిన భారమేనని పేర్కొంటున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా అధికార పార్టీ తమ పార్టీ జెండా రంగులు తీసివేయడం అస్సలు ఇష్టం లేదు. కానీ హైకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో ఆ రంగులు మార్చక తప్పదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అటు కోర్టు ఆదేశాలు పాటించినట్టుగా చూపిస్తూనే.. తమ పార్టీ రంగులు తీయకుండా ఉండేలా ఉత్తర్వులు వెలువరించింది. అదనంగా మరో రెండు రంగులు వేయడం ద్వారా తమ మాట నెగ్గించుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ బిల్డింగ్ కోడ్ లో రంగులకు సంబంధించి ఎలాంటి నిబంధనలూ లేవని, గ్రామీణ సంస్కృతి ఆధారంగా రంగులు ఎంచుకునే స్వేచ్ఛ తమకు ఉందని పేర్కొంది. రంగులపై నియమించిన నిపుణుల కమిటీ సూచించిన రంగులను ఈ సందర్భంగా సర్కారు వివరించింది.

వ్యవసాయానికి ప్రతీకగా ఆకుపచ్చ, ఆక్వా ఉత్పత్తులను ప్రతిబింబించేలా నీలిరంగు, పాల ఉత్పత్తులకు తెలుపు, భూమికి గుర్తుగా మట్టి రంగు వేయాలని కమిటీ సూచించినట్టు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటికి అదనంగా స్థానిక సంప్రదాయలను బట్టి మరో రంగు జోడించవచ్చని సూచించింది. మట్టి రంగు మినహా మిగిలిన మూడు రంగులూ వైసీపీ జెండా రంగులే కావడం గమనార్హం. మట్టి రంగు కాకుండా మరో రంగు జోడించాలన్న సర్కారు.. అందులోనూ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. కాషాయ రంగును వేయడం ద్వారా బీజేపీని కూడా సంతృప్తపరచవచ్చని భావిస్తోంది.

అలా చేయడం వల్ల బీజేపీ ఈ వ్యవహారంలో విమర్శలు చేసే పరిస్థితి ఉండదని యోచిస్తోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఓ పంచాయతీకి ఈ రంగులు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పద్ధతి అనుసరించనున్నారు. మొత్తానికి కోర్టు స్పష్టంచేసినా.. అధికార పార్టీ మాత్రం తాను అనుకున్నదే చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...