Switch to English

ఇన్ సైడ్ స్టోరీ: వారు.. ఎవరికీ పట్టని నాలుగో సింహాలు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

ప్రపంచానికి పెను సవాల్ గా మారిన కరోనా సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. మానవజాతి ఎప్పుడూ చూడని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. రాజు, పేద, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎవరినైనా ఈ మహమ్మారి కలుపుకొని పోతోంది. దీనిని నిరోధించేందుకు పోరాడుతున్న యోధుల్లో వైద్య సిబ్బందితోపాటు పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ముందు వరుసలో ఉన్నారు. వీరినే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటున్నారు. వీరితోపాటు కనిపించిన నాలుగో సింహం కూడా ఒకటి ఉంది. వారే పాత్రికేయులు. అందరూ ఆ ముగ్గురి గురించే మాట్లాడతారు తప్ప వీరి గురించి ఎవరూ మాట్లాడే పరిస్థితే ఉండదు.

లాక్ డౌన్ విధించినా, కర్ఫ్యూ పెట్టినా పాత్రికేయులు మాత్రం పని చేయక తప్పదు. అందరికీ పండగ రోజుల్లో సెలవు ఉంటుంది. కానీ జర్నలిస్టులకు మాత్రం ఉండదు. ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళతారో, తిరిగి ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. ఇంత చేస్తున్నా కనీస భద్రత కూడా లేని బతుకులు వారివి. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియని దుస్థితి. అయినప్పటికీ విధి నిర్వహణలో పలువురు పాత్రికేయులు చూపించే చిత్తశుద్ధిని ఏ మాత్రం తక్కువ చేయలేం. అన్నిచోట్లా మంచి, చెడు ఉన్నట్టే.. జర్నలిజంలోనూ ఈ రెండూ ఉన్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా చాకచక్యంగా నాలుగు రాళ్లు వెనకేసుకునేవారు కూడా ఈ రంగంలో ఉన్నారు.

అదే సమయంలో రెక్కలు ముక్కలు చేసుకుని నాలుగు రాళ్లు కొడితే ఎంత వస్తుందో అంత కూడా సంపాదించలేని వారూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటివారే ఎక్కువ. ప్రస్తుత కరోనా కాలం పాత్రికేయులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వాలు.. పాత్రికేయులను మాత్రం తమకు సంబంధం లేనివారిగా పక్కన పెట్టేశాయి.

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ధీటుగా తమ విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించకపోవడం వారి దుస్థితికి నిదర్శనం. కరోనాకు చికిత్స చేసే ఆస్పత్రులతోపాటు రెడ్ జోన్లు, హాట్ స్పాట్ల వంటి ప్రాంతాల్లో జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా తిరగాల్సి వస్తోంది. దీంతో కరోనా బారిన పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడులోని ఓ ఛానల్ కు చెందిన 27 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఫీల్డ్ లో తిరిగి వచ్చిన రిపోర్టర్ల కారణంగా డెస్క్ సిబ్బందీ వైరస్ బారిన పడ్డారు. అలాగే ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా వచ్చింది.

తాజాగా తెలంగాణలోనూ పలువురి పాత్రికేయులను క్వారంటైన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో పాత్రికేయుల్లోనే కాస్త కదలిక వచ్చింది. మనల్ని ఎవరూ కాపాడరు.. మనల్ని మనమే కాపాడుకోవాలని జర్నలిస్టు సర్కిళ్లలో మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి. మనకు ఏమైనా అయితే, ఎవరూ ఆదుకోరనే విషయం గుర్తుంచుకోవాలంటూ పలువురు తమ తోటి పాత్రికేయులను హెచ్చరిస్తున్నారు. ‘‘రోజూ విధి నిర్వహణ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తుంటే చుట్టుపక్కలవారు అభ్యంతరం చెబుతున్నారు. కొంతమంది ఇంటి యజమానులు అయితే గేటుకు తాళాలు వేసేస్తున్నారు. పోనీ ఇంట్లోనే ఉందామంటే కుదరని పరిస్థితి.

అసలే ప్రస్తుతం మీడియాలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వేళకు ఆఫీసుకు వెళ్లకపోతే ఏమవుతుందనే భయం. వెళ్తే.. ఇంటి యజమానులు, చుట్టుపక్కలవారి అభ్యంతరాలు. ఏం చేయాలో అర్థం కావడంలేదు’’ అన్న ఓ మీడియా మిత్రుడి ఆవేదన చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రజ్యోతి, వెలుగు వంటి పత్రికల్లో సిబ్బందికి ‘సెలవులు’ ఇచ్చేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తాం.. ప్రస్తుతానికి రావొద్దని సాగనంపేశారు. ఒకటి రెండు టీవీ ఛానళ్లు పలువురి కొలువులకు నేరుగానే ఉద్వాసన పలకగా.. మరొకొన్ని చిన్న ఛానళ్లు వేతనాల్లో 25 శాతం కోత పెట్టాయి. దీంతో రాబోయే కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఉంటాయో, ఎంతమందికి ఊడతాయో అని పాత్రికేయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

నిజానికి కాస్ట్ కటింగ్ లో భాగంగా ఉద్యోగులు తొలగింపు ప్రక్రియను చేపట్టాలని పలు సంస్థలు గతంలోనే భావించాయి. అలాంటివారికి కరోనా అనుకోని వరంలా వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సాకుతో తాము చేయాలనుకున్న పనులన్నీ ఇప్పుడు చేస్తున్నాయని జర్నలిస్టు వర్గాలే ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. మొత్తానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా విరజిల్లాల్సిన మీడియాలో ఎవరికీ పట్టని నాలుగో సింహంలా పాత్రికేయుల పరిస్థితి మారిపోయింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...