Switch to English

ఇన్ సైడ్ స్టోరీ: వారు.. ఎవరికీ పట్టని నాలుగో సింహాలు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ప్రపంచానికి పెను సవాల్ గా మారిన కరోనా సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. మానవజాతి ఎప్పుడూ చూడని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. రాజు, పేద, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎవరినైనా ఈ మహమ్మారి కలుపుకొని పోతోంది. దీనిని నిరోధించేందుకు పోరాడుతున్న యోధుల్లో వైద్య సిబ్బందితోపాటు పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ముందు వరుసలో ఉన్నారు. వీరినే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటున్నారు. వీరితోపాటు కనిపించిన నాలుగో సింహం కూడా ఒకటి ఉంది. వారే పాత్రికేయులు. అందరూ ఆ ముగ్గురి గురించే మాట్లాడతారు తప్ప వీరి గురించి ఎవరూ మాట్లాడే పరిస్థితే ఉండదు.

లాక్ డౌన్ విధించినా, కర్ఫ్యూ పెట్టినా పాత్రికేయులు మాత్రం పని చేయక తప్పదు. అందరికీ పండగ రోజుల్లో సెలవు ఉంటుంది. కానీ జర్నలిస్టులకు మాత్రం ఉండదు. ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళతారో, తిరిగి ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. ఇంత చేస్తున్నా కనీస భద్రత కూడా లేని బతుకులు వారివి. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియని దుస్థితి. అయినప్పటికీ విధి నిర్వహణలో పలువురు పాత్రికేయులు చూపించే చిత్తశుద్ధిని ఏ మాత్రం తక్కువ చేయలేం. అన్నిచోట్లా మంచి, చెడు ఉన్నట్టే.. జర్నలిజంలోనూ ఈ రెండూ ఉన్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా చాకచక్యంగా నాలుగు రాళ్లు వెనకేసుకునేవారు కూడా ఈ రంగంలో ఉన్నారు.

అదే సమయంలో రెక్కలు ముక్కలు చేసుకుని నాలుగు రాళ్లు కొడితే ఎంత వస్తుందో అంత కూడా సంపాదించలేని వారూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటివారే ఎక్కువ. ప్రస్తుత కరోనా కాలం పాత్రికేయులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వాలు.. పాత్రికేయులను మాత్రం తమకు సంబంధం లేనివారిగా పక్కన పెట్టేశాయి.

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ధీటుగా తమ విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించకపోవడం వారి దుస్థితికి నిదర్శనం. కరోనాకు చికిత్స చేసే ఆస్పత్రులతోపాటు రెడ్ జోన్లు, హాట్ స్పాట్ల వంటి ప్రాంతాల్లో జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా తిరగాల్సి వస్తోంది. దీంతో కరోనా బారిన పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడులోని ఓ ఛానల్ కు చెందిన 27 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఫీల్డ్ లో తిరిగి వచ్చిన రిపోర్టర్ల కారణంగా డెస్క్ సిబ్బందీ వైరస్ బారిన పడ్డారు. అలాగే ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా వచ్చింది.

తాజాగా తెలంగాణలోనూ పలువురి పాత్రికేయులను క్వారంటైన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో పాత్రికేయుల్లోనే కాస్త కదలిక వచ్చింది. మనల్ని ఎవరూ కాపాడరు.. మనల్ని మనమే కాపాడుకోవాలని జర్నలిస్టు సర్కిళ్లలో మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి. మనకు ఏమైనా అయితే, ఎవరూ ఆదుకోరనే విషయం గుర్తుంచుకోవాలంటూ పలువురు తమ తోటి పాత్రికేయులను హెచ్చరిస్తున్నారు. ‘‘రోజూ విధి నిర్వహణ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తుంటే చుట్టుపక్కలవారు అభ్యంతరం చెబుతున్నారు. కొంతమంది ఇంటి యజమానులు అయితే గేటుకు తాళాలు వేసేస్తున్నారు. పోనీ ఇంట్లోనే ఉందామంటే కుదరని పరిస్థితి.

అసలే ప్రస్తుతం మీడియాలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వేళకు ఆఫీసుకు వెళ్లకపోతే ఏమవుతుందనే భయం. వెళ్తే.. ఇంటి యజమానులు, చుట్టుపక్కలవారి అభ్యంతరాలు. ఏం చేయాలో అర్థం కావడంలేదు’’ అన్న ఓ మీడియా మిత్రుడి ఆవేదన చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రజ్యోతి, వెలుగు వంటి పత్రికల్లో సిబ్బందికి ‘సెలవులు’ ఇచ్చేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తాం.. ప్రస్తుతానికి రావొద్దని సాగనంపేశారు. ఒకటి రెండు టీవీ ఛానళ్లు పలువురి కొలువులకు నేరుగానే ఉద్వాసన పలకగా.. మరొకొన్ని చిన్న ఛానళ్లు వేతనాల్లో 25 శాతం కోత పెట్టాయి. దీంతో రాబోయే కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఉంటాయో, ఎంతమందికి ఊడతాయో అని పాత్రికేయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

నిజానికి కాస్ట్ కటింగ్ లో భాగంగా ఉద్యోగులు తొలగింపు ప్రక్రియను చేపట్టాలని పలు సంస్థలు గతంలోనే భావించాయి. అలాంటివారికి కరోనా అనుకోని వరంలా వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సాకుతో తాము చేయాలనుకున్న పనులన్నీ ఇప్పుడు చేస్తున్నాయని జర్నలిస్టు వర్గాలే ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. మొత్తానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా విరజిల్లాల్సిన మీడియాలో ఎవరికీ పట్టని నాలుగో సింహంలా పాత్రికేయుల పరిస్థితి మారిపోయింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...