కరోనా సినీ పరిశ్రమపై భయంకరమైన దెబ్బ కొట్టింది. అన్ని భాషల సినిమాలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే పైరసీ ప్రభావం, ఓటీటీ ప్రభావం, శాటిలైట్ దెబ్బలతో సినిమా పరిశ్రమ తీవ్రమైన అవస్థలు పడుతుంది. ఈ సమయంలోనే కరోనా ప్రభావం సినిమా పరిశ్రమపై చెప్పలేనంతగా పడినదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత కూడా సినిమా పరిశ్రమలో పరిస్థితి సర్దుబాటు అవుతుందనే నమ్మకం లేదు.
కరోనా భయానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మే నెల మొత్తం మాత్రమే కాకుండా మరో రెండు నెలల వరకు కూడా థియేటర్ల వైపుకు ప్రేక్షకులు వచ్చే అవకాశం లేదని.. అందుకే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కనీసం రెండు నెలలు అయినా థియేటర్లను మూసేస్తే బెటర్ అంటూ ప్రముఖ నిర్మాత సురేష్బాబు అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. రెండు నెలల తర్వాత అయినా థియేటర్లకు జనాలు వస్తారా రానా అనేది అనుమానమే.
ఒక ఫ్యామిలీ మొత్తం మల్టీప్లెక్స్కు సినిమాకు వెళ్లాలి అంటే కనీసం రెండున్నర మూడు వేల రూపాయలు అవుతుంది. చాలా మంది ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. చాలా వరకు వ్యాపారాలు నష్టపోతున్నారు. మరికొందరు పెద్ద ఎత్తున ఆర్థికంగా కుదేలయ్యారు. అలాంటి వారంతా కూడా ఇప్పట్లో మల్టీప్లెక్స్ల్లోకి వెళ్లే అవకాశం లేదని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్లకు ఒకటి రెండు నెలల తర్వాత జనాలు క్యూ కట్టే అవకాశం ఉన్నా మల్టీప్లెక్స్ల్లో మాత్రం జనాలు ఫిల్ అవ్వాలంటే ఆరు నెలలు అయినా పడుతుంది. అందుకే కొందరు మల్టీప్లెక్స్లను ఆరు నెలల పాటు మూసేస్తే బెటర్ అనే సలహా కూడా ఇస్తున్నారు. జూన్ లేదా జులైలో పరిస్థితి ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ రెడీ అయ్యి అందుబాటులోకి వచ్చిన తర్వాతే అన్ని రంగాల్లో పరిస్థితి యధాస్థితికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
494283 833553You created some decent points there. I looked on the internet for that issue and located most individuals will go together with with the site. 143221
17530 451568Hi, you used to write outstanding articles, but the last several posts have been kinda boring I miss your tremendous posts. Past few posts are just a little out of track! 733151