కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమవంతు సాయంను అందిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో కరోనాపై అవగాహణ కలిగించేందుకు పలువురు స్టార్స్ వీడియో బైట్స్ను విడుదల చేసి లాక్ డౌన్ను పాటించాలని, ప్రతి ఒక్కరు కూడా విధిగా ఇంటికే పరిమితం అవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక సాయం విషయంలో కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా లక్షల్లో కోట్లలో విరాళాలను ప్రకటించారు.
ఇప్పుడు మరోసారి కరోనా అవగాహణ కోసం హీరోలు అంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చేందుకు సిద్దం అయ్యారు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్తో పాటు చిరంజీవి, రజినీకాంత్ ఇంకా ప్రముఖ నటీనటులు కొందరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్లో నటించబోతున్నారు. ఆ షార్ట్ ఫిల్మ్కు ప్రసూన్ పాండే దర్శకత్వం వహించబోతున్నాడు. అమితాబచ్చన్ ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాణ పర్యవేక్షణ చూడబోతున్నాడు.
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రముఖులు అంతా విరాళాలు భారీగా ఇచ్చే విధంగా ఈ షార్ట్ ఫిల్మ్ ఉండటంతో పాటు ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా వచ్చిన మొత్తంను కూడా కరోనాపై కేంద్రం చేస్తున్న యుద్దంకు విరాళంగా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్ కు ‘ఫ్యామిలీ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. అయితే ఫిల్మ్ ఎలా తెరకెక్కిస్తారు అనే విషయమై క్లారిటీ రాలేదు.
107382 365144My spouse and I stumbled more than here from a different internet site and thought I may as properly check issues out. I like what I see so now im following you. Look forward to going more than your web page repeatedly. 272649