పేరుకే పెద్దల సభలు.. కానీ, అవి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలు.. అనే అభిప్రాయం ప్రస్తుత రాజకీయాల్లో బాగా బలపడిపోయిందంటే, దానిక్కారణం.. ప్రజా క్షేత్రంలో గెలవలేమనుకున్నవాళ్ళంతా ఆ పెద్దల సభల్ని ఎంచుకోవడం.. ఈ క్రమంలో పెద్దయెత్తున ఆయా పార్టీలకు ‘ముడుపులు’ ముట్టజెప్పుకోవడమే. లేకపోతే, వ్యాపారవేత్తలకే అధికంగా పెద్దల సభలో సీట్లు ఎందుకు దక్కుతుంటాయ్.?
ఇక, అసలు విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘మండలి రద్దు’ అంశం కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్షానికి అసెంబ్లీలో బలం సరిగ్గా లేదు గనుక, మండలిలో వున్న బలాన్ని పట్టుకుని వేలాడుతోంది. ఇదే, అధికారపక్షానికి నచ్చడంలేదు. అందుకే, మండలి రద్దు.. అంశం తెరపైకొచ్చింది. దాంతో, ప్రతిపక్షంలో కొంత ఆందోళన కన్పిస్తోంది.
ప్రతిపక్షంలోనే కాదు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ మండలి రద్దు అంశం తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. ‘ఇదేం తుగ్లక్ ఆలోచన.?’ అంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైసీపీ ముఖ్య నేత తన సన్నిహితుల వద్ద వాపోయాడు. ఆయనొక్కడే కాదు, ‘మండలి రద్దు’ ఊహాగానాలు రావడంతో, ‘ఇది నిజమేనా.?’ అంటూ పలువురు వైసీపీ నేతలు, పార్టీ ముఖ్య నేతల్ని వాకబు చేశారట.
‘అవును, ఆ దిశగా మంతనాలు జరుగుతున్నాయి..’ అనే ఖచ్చితమైన సమాచారం పార్టీ వర్గాల నుంచి రావడంతో, ‘ఏమో, రేప్పొద్దున్న అసెంబ్లీని కూడా రద్దు చేసేస్తానంటాడేమో..’ అంటూ వైసీపీలోనే కొందరు సీనియర్ నేతలు పరిస్థితి తీవ్రతను తెలుసుకుని గుస్సా అవుతున్నారు. అయితే, పైకి మాత్రం పార్టీ నేతలు ‘అదంతా దుష్ప్రచారమే’ అని కొట్టి పారేస్తుండడం గమనార్హం. ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. వినాశకాలే విపరీత బుద్ధి.. అని పెద్దలు ఊరకే అన్లేదు మరి.
508406 686306I preferred than you may be now. 923950