పవన్ కళ్యాణ్ అమరావతి విషయంలో స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితిల్లో కూడా అమరావతి మార్చకూడదని, ఒకవేళ మారిస్తే అది తాత్కాలికమే అని ఇప్పటికే పవన్ స్పష్టం చేశారు వైకాపా 30 రాజధానులు పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని, పవన్ పేర్కొన్నారు. త్వరలోనే తిరిగి అన్ని అమరావతికి చేరుకుంటాయని అన్నారు. మూడు రాజధానులు జనసేన, బీజేపీ వ్యతిరేకం అని చెప్పిన పవన్ గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకే రాజధానికి ఉండాలని అన్నారు.
కాగా, దీనిపై పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి అక్కడ సీనియర్ నేతలతో కలవబోతున్నారు. బీజేపీ నేతలతో అమరావతి రాజధాని గురించి మాట్లాడబోతున్నారు. అలానే ఈ ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి వచ్చిన రైతులను కలుస్తూ వారి సమస్యలు తెలుస్తుకుంటూ వారికీ అండగా ఉంటామని ఇప్పటికే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు, వైకాపా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అమరావతే రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు.
వచ్చే రెండేళ్లలో వైకాపా సర్కార్ కూలిపోతుందని, రెండేళ్లలోనే మరలా ఏపికి ఎన్నికలు వస్తాయని పవన్ జ్యోస్యం చెప్పారు. దీనిపైనా వైకాపా సర్కార్ ఘాటుగా విమర్శించింది. కూల్చడానికి ఇది సర్కార్ సినిమా సెట్ కాదని, ప్రజా ప్రభుత్వం అని వైకాపా పార్టీ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈరోజు కూడా అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. మండలిలో ఈ బిల్లును అడ్డుకోవడానికి రూల్ నెంబర్ 71 ను వినియోగించుకుంది. మండలిలో బిల్లును అడ్డుకోవడంతో మండలిని రద్దు చేసే దిశగా వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈరోజు రాత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది వైకాపా ప్రభుత్వం. ఈ కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మరికాసేపట్లో తేలిపోతుంది.
934876 24764You created some decent factors there. I looked on the internet for the issue and located most individuals will go along with together with your web site. 977131
3374 559161Oh my goodness! a amazing post dude. Thanks Nonetheless My business is experiencing concern with ur rss . Do not know why Struggling to join it. Is there anybody finding identical rss concern? Anyone who knows kindly respond. Thnkx 109361