Switch to English

ఇంకా ఎన్నాళ్ళు ఈ దుస్థితి రాజా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

గత నెల రోజులుగా అమరావతి రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, నినాదాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం అక్కడ దాదాపుగా రూ. 10వేల కోట్లు ఖర్చు చేసింది. అంతేకాదు, సంవత్సరానికి 5వేల కోట్ల రూపాయల చొప్పున అమరావతిలో పెట్టుబడులు పెట్టుకుంటూ పొతే… ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దొచ్చు అన్నది గత ప్రభుత్వం ప్లాన్. ప్లాన్ బాగానే ఉన్నది. అయితే, ఈ ప్లాన్ ను అమలు చేయడంలో ఆలస్యం చేసింది. అదే ఇప్పుడు కొంపముంచింది.

10 వేల కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక భవనాలు నిర్మించడమే చేసిన తప్పు. అలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన కొన్ని నిర్మాణాలు చేపట్టి ఉంటె ఇప్పుడు వైకాపా ప్రభుత్వం రాజధానిని మార్చేందుకు సాహసం చేసేది కాదు. తాత్కాలిక భవనాలు ఎందుకు కట్టారు అని వైకాపా ప్రభుత్వం అడిగితె బాబు దగ్గర సరైన సమాధానం లేకపోవడంతో వైకాపా ఆడింది ఆటగా మారిపోయింది.

33 వేల ఎకరాల భూమిని బాబు హయాంలో రైతులు రాజధాని కోసం ఇచ్చారు. రాజధాని విషయంలో బాబు తప్పు చేశారు. ప్రజలను మోసం చేశారు. బాబు చేసిన తప్పులకు తామెందుకు సమాధానం చెప్పాలి అని వైకాపా నేతలు అంటుంటే, తెలుగుదేశం పార్టీ మాత్రం, రాజధానిని మార్చే హక్కు మీకెవరు ఇచ్చారని ప్రశ్నిస్తోంది. రాజధానిని మార్చాలి అంటే ప్రజలు ఒప్పుకోవాలని, ప్రజాసమ్మతితోనే మార్పు సాధ్యం అవుతుందని, అలా కాకుండా బలవంతంగా మార్చాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలుగుదేశం పార్టీ అంటోంది.

ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో పాపం రైతులు నలిగిపోతున్నారు. భవిష్యత్తులో తమ జీవితాలు బాగుపడతాయని, తమ బిడ్డలతో పాటు, రాష్ట్రంలోని చాలామందికి మంచి జరుగుతుందని చెప్పి భూములను రాజధాని కోసం ధారాదత్తం చేశారు. అలా తీసుకున్న భూములను ప్రభుత్వం చదును చేసి రోడ్లు వేసింది.

ఇప్పుడు ఆ స్థలంలో రాజధాని కట్టడం లేదని అంటే పాపం ఆ రైతులు ఏమైపోవాలి. అసలు రాజధాని గురించి మాట్లాడని విశాఖకు రాజధానిని తరలిస్తామని అనడం ఏంటి… పైగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అని చెప్పి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు అమరావతి రైతులు. చూస్తుంటే రాజధాని సమస్య రాష్ట్రం దాడి దేశ సమస్యగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...