ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసి దివాకర్ రెడ్డికి సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. వైఎస్ రాజశేఖర్ రెడ్డినే భయపెట్టిన వ్యక్తి జేసి. వాళ్ళ వ్యాపారాలకు రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు అడ్డురాలేదు. అటు తెలుగుదేశం ప్రభుత్వం కూడా జేసి సోదరుల జోలికి వెళ్లేందుకు సాహసించలేదు. కానీ, జగన్ ఆ సాహసం చేస్తున్నాడు. జేసితో డైరెక్ట్ గా ఢీ కొట్టడంతో కడప వర్సెస్ అనంతపురం గా మారిపోయింది. ఈ రెండు జిల్లాలు ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు. ఇప్పుడిప్పుడే ఆ ఫ్యాక్షన్ చరిత్ర నుంచి బయటపడుతున్నాయి.
ఈ సమయంలో సైలెంట్ గా ఉన్న జేసీని జగన్ కెలకడంతో… రాజకీయాల్లో కలకలం రేగింది. జగన్ పై జేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలోపు జగన్ భార్య భారతి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అన్నది అర్ధం కావడం లేదు. ఈ వ్యాఖ్యలు చేయడం అంటే జగన్ పదవి నుంచి దిగిపోవడమే కదా. ప్రస్తుతం జగన్ సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నాడు.
శుక్రవారం రోజున జగన్ తప్పనిసరిగా సిబిఐ కోర్టుకు హాజరుకావాలని న్యాయస్తానం ఆదేశించింది. ఈనెల 17 వ తేదీన జగన్ సిబిఐ కోర్టుకు హాజరుకాబోతున్నారు. ఇది వేరే సంగతి అనుకోండి. అయితే, జగన్ పై జేసి ఇంతగా రెచ్చిపోయి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వెనుక చాలా కారణం ఉన్నది. అందులో జేసి వ్యాపారసంస్థ అయిన దివాకర్ ట్రావెల్స్ ను అడ్డుకోవడమే. ఈ ట్రావెల్స్ పై ప్రభుత్వం కేసులు పెట్టింది.
ఎందుకు వచ్చిన గొడవలే అని జేసి ప్రస్తుతం తన వ్యాపారాన్ని పక్కన పెట్టారు. ఆ మనోవ్యధను ఇలా వ్యక్తం చేస్తున్నారు అని కొందరి అభిప్రాయం. జేసికి కోపం వస్తే ఎలా మాట్లాడతారో అందరికి తెలుసు. కానీ, ఇంతలా రెచ్చిపోయి మాట్లాడతారని మాత్రం ఎవరూ ఊహించలేదు. కాలినొడికి కదా ఆ నొప్పి తెలుస్తుంది.
జేసి వ్యాపారం మూతపడటంతో వస్తున్న నష్టాల దెబ్బకు జేసి చిత్తవుతున్నాడు. ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియక ఇలా చేస్తున్నారు. జగన్ పై ఉన్న నమ్మకాన్ని ప్రజలు కోల్పోయారని, పారిశ్రామిక వేత్తలు కూడా ఏపీ అంటే భయపడుతున్నారని, అందుకే పక్కరాష్ట్రాలకు పరిశ్రమలు తరలిపోతున్నాయని జేసి పేర్కొన్నారు. జేసి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారాయి.
36235 273917Absolutely nothing better than Bing obtaining us a great internet site related to what I was looking for. 985553