ఇసుక మాత్రమే కాదు, ఉల్లి కూడా ప్రాణం తీస్తుంది. ఔను, ఆంధ్రప్రదేశ్లో ఉల్లి ఘాటుకి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఉల్లి కొరత ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా వుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే. బహిరంగ మార్కెట్లో 150 నుంచి 200 వరకు ఉల్లి ధర కన్పిస్తుండగా, ప్రభుత్వం రైతు బజార్లలో కిలో 25 రూపాయలకే అందిస్తుండడంతో జనం, ఆ రాయితీ ఉల్లి కోసం క్యూలు కడుతున్నారు.
అయితే, ఈ క్యూలు చాంతాడంత వుండడంతో క్యూ లైన్లలో నిల్చోలేక జనం నానా తంటాలూ పడుతున్నారు. అలా ఉల్లి కోసం చాలాసేపు క్యూ లైన్లో వేచి వున్న సాంబయ్య అనే వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అతన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు.
నిన్న మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత కారణంగా కూలిపోయిన భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాల్ని చూశాం. దాదాపు 50 మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఇసుక కొరత కారణంగా. ఇప్పుడు పెరిగిన ఉల్లి ధరలతో సామాన్యుల ప్రాణాలు పోతున్నాయి.
రాజన్న రాజ్యంలో ఇసుక కోసం, ఉల్లి కోసం కూడా ప్రాణాలు కోల్పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఇది కూడా ప్రతిపక్షాల కుట్ర.. అని అధికార పార్టీ ఎదురుదాడికి దిగుతుందా.? అసెంబ్లీ సమావేశాల వేళ ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వానికి సంకటమే. అయితే, ప్రతిదానికీ ఎదురుదాడే సమాధానంగా భావిస్తున్న అధికార పక్షం, ఉల్లి మరణాలపైనా.. అదే తీరు ప్రదర్శిస్తుండడం దురదృష్టకరం.
126953 411530really good put up, i definitely enjoy this web site, keep on it 603078