అవునే.. నిజమే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని చూసి వైసీపీ భయపడుతున్నట్టే కనిపిస్తోంది. జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురం లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ భారీ ఎత్తున ఖర్చు పెడుతుందట. ఓటుకి రూ.10 వేలు, ఫ్యామిలీకి లక్ష రూపాయలు ఇచ్చేందుకు ఇవ్వడానికి రెడీ అయిపోయిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిప్పు లేనిదే పొగ రాదు కదా. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి ఆజ్యం పోసింది.
పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో ఆంధ్ర రాజకీయం దృష్టి అంతా పిఠాపురం మీదనే ఉంది. అక్కడ ఆయన ప్రచారం చేస్తున్న తీరు, జనాదరణ చూసి వైసీపీ వెన్నులో వణుకు పుడుతున్నట్టుంది. మిగతా సీట్ల మాట పక్కన పెడితే పవన్ విషయంలో వైసిపి కూడా తగ్గదు. అందుకే కాపు ఓటర్లను లక్ష్యంగా చేసుకొని వంగ గీతని పవన్ కి పోటీగా దింపారు. తాను కాపు ఆడపడుచునని తనని గెలిపించాలంటూ పదేపదే కుల ప్రస్తావన తీసుకొచ్చి ఓటర్లకి దగ్గర కావడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
ప్లాన్ బి లో భాగంగా ఓటుకి రూ. 10వేలు, ఫ్యామిలీ కి రూ. లక్ష వెచ్చించి ఓట్లు రాబట్టాలని చూస్తుందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఏడేళ్ల క్రితం కాస్ట్లీయస్ట్ ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోయిన నంద్యాల ఉప ఎన్నికలను పిఠాపురం బ్రేక్ చేస్తుందనే చెప్పాలి. అసలు అంత ఖర్చు పెట్టడానికి కూడా వైసిపి వెనకాడటం లేదంటే పవన్ గెలుపుని ఆ పార్టీ ఒప్పేసుకున్నట్టేగా.