Adipurush: ఆదిపురుష్ (Adipurush) సినిమా దర్శకుడు ఓం రౌత్ (Om raut), సీత పాత్రలో నటించిన కృతి సనన్ (Kriti Sanon) పై నాటి టెలీ ధారావాహికం రామాయణ్ సీతగా నటించిన దీపికా చిక్లియా (Deepika chikliya) స్పందించారు. తిరుమలలో వారు వ్యవహరించిన తీరుపై ఆమె మండిపడ్డారు. సీత పాత్రలోని భావోద్వేగాలు ఎవరూ అర్ధం చేసుకోవట్లేదని.. సీతను కేవలం ఓ పాత్రగా భావిస్తున్నారని విమర్శించారు. ఇంకా ఆమె మాటల్లో..
‘ఈ తరం నటీనటులకు ముద్దు, కౌగిలింతలు సర్వసాధారణం. కృతిసనన్ తాను సీతగా నటించానని భావించట్లేదు. నేను రామాయణంలో సీతగా జీవించాను. కానీ.. నేడు సీత ఓ పాత్రగా భావిస్తున్నారు. మేము ఎవరినీ కౌగిలించుకుంది లేదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాక మా పాదాలకు ఎందరో నమస్కరించేవారు.. దేవుళ్లుగానే చూసేవారు. ఆ అనుభూతులు ఇప్పుడు లేవ’ని అన్నారు.
ఇటివల ఆదిపురుష్ ప్రీరిలీజ్ తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఓంరౌత్, కృతిసనన్. దర్శనం తర్వాత బయటకు వచ్చిన వీరు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంపై అనేక విమర్శలు వచ్చాయి. దీనిపైనే దీపికా చిక్లియా స్పందించారు.