Train Accident: ఒడిశాలో (Odisha) ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆగివున్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ (Coromandel express) ఢీకొంది. బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 50 మంది మృతి చెందగా 300 మంది వరకూ గాయపడ్డారని.. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రి 7.30 సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. ప్రమాద వార్త తెలియగానే భద్రక్ నుంచి అయిదు ఆంబులెన్సులను రప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రప్పించారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. బాలేశ్వర్ లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. బాధితుల సమాచారం కోసం 06782262286 నెంబరుకు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ షాలిమర్ నుంచి చెన్నై వెళ్తూండగా ఈ ప్రమాదం జరగింది. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు విచారణ చేపడుతున్నారు.