ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆ పార్టీ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకు రావాలని మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు భావించాడు.
కానీ ఆయన వయసు మరియు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన తనయుడు నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 27వ తారీఖున చంద్రబాబు నాయుడు యొక్క సొంత నియోజకవర్గం కుప్పంలో లోకేష్ యొక్క పాదయాత్ర ప్రారంభం కాబోతుందట.
లోకేష్ పాదయాత్రని నారా భువనేశ్వరి వీర తిలకం దిద్ది హారతి ఇచ్చి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. నారా లోకేష్ కి కూడా రాజకీయంగా మంచి ఇమేజ్ రావాలి అంటే పాదయాత్ర చేయాలి అంటూ చాలా మంది ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారట. ఎన్నికల సమయం కి కచ్చితంగా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో బలమైన ముద్ర వేసేలా పాదయాత్ర ఉంటుందని సమాచారం అందుతుంది.
498390 907738This internet internet page is genuinely a walk-through for all with the information you wanted about this and didnt know who to ask. Glimpse here, and youll surely discover it. 647958