Switch to English

ఓడి గెలిచిన జనసేన.! గెలిచి ఓడిన వైఎస్సార్సీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటును గెలుచుకోగలిగింది జనసేన. ఆ ఎమ్మెల్యే కూడా ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలోకి దూకేసిన విషయం విదితమే.

ఇంతకీ, వైఎస్సార్సీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేంటి.? ఏ అసెంబ్లీలో అయితే కూర్చుని చట్టాలు చేస్తున్నారో, ఆ అసెంబ్లీ వున్న ప్రాంతాన్ని దెయ్యాల రాజధాని అంటున్నారు వైసీపీ నేతలు, అందునా మంత్రులు. అమరావతిని స్మశామన్నారు, ముంపు ప్రాంతంగా అభివర్ణించారు, ఎడారి అని కూడా అన్నారు. అక్కడే, ఆ దెయ్యాల రాజధానిలోనే.. ఆ స్మశానంలోనే.. ఆ ముంపు ప్రాంతంలోనే, ఆ ఎడారి ప్రాంతం నుంచే మూడున్నరేళ్ళుగా పాలన చేస్తోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.! ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటే.!

ఇంతకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేంటి.? ‘వైఎస్ జగన్ మాట ఇచ్చాడంటే.. తగ్గేదే లే.. మాట తప్పడు.. మడమ తిప్పడు..’ అని వైసీపీ నేతలు అంటుంటారు. ‘మాట తప్పే పరిస్థితి వస్తే, నాయకులకు జనం చెప్పులు చూపించాలి..’ అని ఇదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో సెలవిచ్చారు.

ఏదీ, రాజధాని అమరావతి.? ఏదీ పోలవరం ప్రాజెక్టు.? ఏదీ ప్రత్యేక హోదా.? ఏదీ కడప స్టీలు ప్లాంటు.? ఏదీ దుగరాజపట్నం పోర్టు.? ఇలా ఏ ప్రశ్న వేసినా, జనసేన అధినేత మీద ఎదురుదాడి చేస్తుంటారు వైసీపీ నేతలు.

‘ఓడిపోయి బతికిపోయావ్.. అసెంబ్లీకి వచ్చి వుంటే.. చంద్రబాబు ఏడ్చారు.. నువ్వైతే రోజూ గిక్క తిప్పుకోకుండా ఇంకా గట్టిగా ఏడ్చేవాడివి..’ అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా జనసేనాని మీద సెటైర్లేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఏడుస్తాడు.? చంద్రబాబు అయినా ఏడవాల్సిన ఖర్మ ఏంటి.? ఏడుస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు.

‘మా రాజధాని ఏంటో మాకే తెలియదు..’ అనేంత దయనీయ స్థితిని రాష్ట్ర ప్రజలకు వైసీపీనే కల్పించింది. మాట ఇచ్చాడు, తప్పాడు.. చెప్పులు చూపించడం కాదు కదా.. కనీసం ప్రశ్నించాలనుకుంటున్నా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ప్రజల గొంతుల్ని నొక్కేస్తున్నారన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇంతకీ, ఎవరు గెలిచినట్లు.? 2019 ఎన్నికలో వైసీపీ గెలిచింది.. ఆంధ్రప్రదేశ్ ఓడిపోయింది.! ఇది కదా జరిగింది.? ముఖ్యమంత్రికైనా తెలుసా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు సమాధానం.? సమస్యలు చెప్పుకోవడానికి జనం, జనసేన వద్దకు వెళుతున్నారు. ఇదీ ఓడి గెలవడమంటే.! వైసీపీ సభల నుంచి జనం పారిపోతున్నారు.. ఇదీ గెలిచి ఓడటమంటే.! ఎనీ డౌట్స్.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...