రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మితే ఒకటి.. రాష్ట్రాన్ని అమ్మేస్తే ఒకటి.. రెండూ వేర్వేరని అనగలమా.? రెండూ ఒక్కటేనని అనొచ్చా.? ప్రభుత్వమంటే, ప్రజల కోసం పని చేయాలి. కానీ, ఆ ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అమ్మేస్తామంటే ఎలా.?
వాస్తవానికి, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలనేది కొత్త వ్యవహారం కాదు. అధికారంలోకి వచ్చేటోళ్ళు, జనాన్ని ఉద్ధరించేస్తామనే పేరుతో చేసేది, అమ్మకాలు మాత్రమే. గతంలోనూ జరిగింది, ఇప్పుడూ జరిగింది.. ఇకపైనా జరుగుతుంది. ఎందుకంటే, రాజకీయం మారదు. ఎవరు అధికారంలో వున్నా, చేసేది అదే.
జనం తమ ఓట్లనీ, తమ భవిష్యత్తునీ ఎన్నికల వేళ కరెన్సీ నోట్లకు కక్కుర్తి పడి రాజకీయ పార్టీలక అమ్మేసుకుంటున్నప్పుడు, అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర సంపదను ఎందుకు అమ్మేయకుండా వుంటారు.? గనులు, భూములు.. ఇలా ఒకటేమిటి, అన్నిటినీ అమ్మేస్తారు.
అంటే, ఇది రిటైల్ అమ్మకం అన్నమాట. హోల్ సేల్.. అంటే, రాష్ట్రాన్ని గంపగుత్తగా అమ్మేయడమొక్కటే మిగిలి వుందన్న విమర్శ ప్రజాస్వామ్యవాదుల నుంచి వినిపిస్తోంది. రాష్ట్రాలే కాదు, కేంద్రానిదీ అదే దారి.! ఆవు చేలో మేస్తోంటే, దూడ గట్టున మేస్తుందా.? అన్న చందాన తయారైంది పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయానికొస్తే, దీనికి వైసీపీ చాలా పేర్లు పెట్టింది. కమ్మరావతి.. స్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం.. ఇలా బోల్డన్ని పేర్లు పెట్టారు అధికార పార్టీ నేతలు, అందునా మంత్రులు.. అమరావతిపై చిమ్మిన విషం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇప్పుడు అదే అమరావతి, జగన్ సర్కారుకి మిగిలిన ఏకైక దిక్కులా కనిపిస్తోంది. ఔను, ఎక్కడా అప్పు పుట్టని కారణంగా, అమరావతిని అమ్మేయడానికి సిద్ధమైంది వైసీపీ సర్కారు. పైన చెప్పుకున్నట్లు రిటైల్ మోడ్లో అన్నమాట. భవనాల్ని లీజుకిస్తారట.. భూముల్ని వేలం వేస్తారట..!
అమరావతిని గతంలో స్మశానమని అన్నారుగా.? ఆ స్మశానాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టామని వైసీపీ సర్కారు ఘనంగా చెప్పుకోగలదా.? చివరికి ఈ స్థాయి దిగజారిపోయిందన్నమాట వైసీపీ పాలన.. అనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయ్.
600173 846373We will have a hyperlink change agreement among us! 209103
56683 916889 warning Dont any of you folks ever take me to CiCis pizza! There food looks offensive!|Urban_Elegance| 19090